ఓవైసీ తమ్ముడా - ఓసారి యూపీ, హర్యానాలకు వచ్చి చూసిపో : హేమంత బిశ్వశర్మ

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2023, 10:18 PM IST

thumbnail

Assam CM Hemanta BiswaSarma Election Campaign : రాష్ట్రంలో బీజేపీ సర్కార్​ ఏర్పాటుతో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్​ బిశ్వశర్మ అన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొన్నారు. కరీంనగర్​, వికారాబాద్​ జిల్లాల్లో నిర్వహించిన బీజేపీ రోడ్​షోలలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిరుపేదలకు ప్రతి ఏటా ఉచితంగా నాలుగు సిలిండర్ల వంట గ్యాస్​ పంపిణీ చేస్తామని హేమంత్​ బిశ్వశర్మ హామీ ఇచ్చారు. పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గిస్తామని.. రాష్ట్రంలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలు అంతర్గతంగా కలిసి పని చేస్తున్నాయని విమర్శలు చేశారు.  

ఒవైసీ తమ్ముడా ఓసారి యూపీ, హర్యానా రాష్ట్రాలకు వచ్చి చూడు.. ఐదు నిమిషాల్లో నీ ఇసాబ్​ పూర్తి చేస్తామని అసోం సీఎం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, ఎంఐఎం పార్టీలు ఒకటేనని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ రాబోతోందని.. బీసీ వ్యక్తే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్​ దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని మోసం చేశారని మండిపడ్డారు. అందుకే బీజేపీ అందరికీ న్యాయం చేసే పరిపాలన చేస్తోందని హేమంత్​ బిశ్వ శర్మ తెలిపారు.

Telangana Election Polls 2023 : హైదరాబాద్​లో ఏ పార్టీ వచ్చినా.. ఒవైసీకి జిందాబాద్​ కొడుతున్నారని అసోం సీఎం హేమంత్​ బిశ్వశర్మ అన్నారు. కాంగ్రెస్​ వస్తే ముస్లింలకు రిజర్వేషన్​ కల్పిస్తామని మాట ఇచ్చారని.. అదే బీఆర్​ఎస్​ వస్తే ముస్లింల కోసం ఐటీ పార్కు నిర్మిస్తామని అంటున్నారని గుర్తు చేశారు. రెండు రోజుల క్రితం అసదుద్దీన్​ పోలీసులను బెదిరించాలని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, ఎంఐఎం పార్టీలతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.