వైరల్: రైలు మీద నుంచి వెళ్లినా ప్రాణాలు సేఫ్​

By

Published : May 31, 2021, 2:23 PM IST

thumbnail

ఉత్తర్​ప్రదేశ్​ మథురాలో ఓ వింత ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన ఓ వ్యక్తి దగ్గరలోని రైలు పట్టాల మీద పడుకున్నాడు. రైలు మీద నుంచి వెళ్లినా ఆయనకు చిన్న గాయం కూడా కాలేదు రాయ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బదుద్ధీన్​ గ్రామానికి చెందిన గజేంద్ర.. కుమారుని మృతితో మానసిక వేదనకు గురై చనిపోవాలనుకుని ఇలా చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.