ETV Bharat / state

'ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాం... ప్రభుత్వ భూమి అంటూ బెదిరిస్తున్నారు'

author img

By

Published : Mar 7, 2021, 1:06 PM IST

ameenpur-colony-people-case-file-against-thakur-rajkumar-singh-for-land-issues-in-sangareddy-district
'ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాం... ప్రభుత్వ భూమి అంటూ బెదిరిస్తున్నారు'

ఏన్నో ఏళ్లుగా నివాసముంటున్న తమని ప్రభుత్వ భూములంటూ కొందరు బెదిరిస్తున్నారని అమీన్​పూర్ మున్సిపల్ పరిధిలోని కాలనీ వాసులు వాపోయారు. ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ అనే వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులు అమీన్​పూర్ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మున్సిపల్ పరిధిలోని లింగమయ్య కాలనీ, మంజీరా కాలనీ వాసులు ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్​ అనే వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న తమను ప్రభుత్వ భూములంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు.

ఇళ్లలో ఎవరూ లేని సమయంలో వచ్చి పిల్లలకు నోటీసులు అందజేస్తున్నారని ఆరోపించారు. స్థానికులందరూ ర్యాలీగా వెళ్లి అమీన్​పూర్ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: ఇంధన ధర పెంపునకు నిరసనగా భట్టి సైకిల్ యాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.