ETV Bharat / state

మాసబ్ చెరువును పరిరక్షించాలంటూ స్థానికులు ఆందోళన

author img

By

Published : Jan 10, 2021, 11:21 AM IST

in the presence of all party leaders locals are worried about the need to protect the Turkayamjal Masab pond
మాసబ్ చెరువును పరిరక్షించాలంటూ స్థానికులు ఆందోళన

తుర్కయంజాల్ మాసబ్ చెరువును పరిరక్షించాలంటూ అఖిలపక్ష ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు. ఎన్నో కుటుంబాలు చెరువుపై ఆధారపడి ఉన్నాయని.. నీటిని వదిలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చెరువును కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలం తుర్కయంజాల్ మాసబ్ చెరువును పరిరక్షించాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. చెరువు నీటిని వదలకూడదని.. చెరువును కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఇప్పటికైనా హద్దు రాళ్లు పాతి చెరువును రక్షించాలని కోరారు.

ఇరిగేషన్ డిపార్ట్​మెంట్​ అధికారులు తుర్కయంజాల్ మాసబ్ చెరువుని పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆదిత్యానగర్​లో ఇప్పటికీ ఉన్న నీటిని పూర్తిగా తీసివేయడానికి సుమారు 7 రోజుల సమయం పడుతుందని.. మాసబ్ చెరువు నుంచి నీరు దిగువకు వదిలితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు అంచనాకి వచ్చినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన రిపోర్ట్​ని ఉన్నతాధికారులకు పంపిస్తామని.. వారి ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత చెరువు నిండిందని.. చెరువు నీటిని వదిలితే ఊరుకునేది లేదని స్థానికులు హెచ్చరించారు. ఎన్నో కుటుంబాలు చెరువుపై ఆధారపడి ఉన్నాయన్నారు.

ఇదీ చూడండి: తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన: తరుణ్ చుగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.