రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో సెల్ఫీ దిగుతానంటూ మంత్రి కేటీఆర్ను కోరింది ఓ వృద్ధురాలు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు మంత్రి కేటీఆర్. గంభీరావుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి తిరిగి వెళ్తున్న క్రమంలో వృద్ధురాలు... కేటీఆర్ను సెల్ఫీ కోరింది.
మాస్కు తీసి తనతో సెల్ఫీ దిగాలని ఆ పెద్దమనిషి కోరారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. మాస్కు తీయాలని కేటీఆర్కు తెలిపింది. వృద్ధురాలి ఉత్సాహం చూసి మాస్క్ తీసి సెల్ఫీ దిగారు. ఏం కావాలని కేటీఆర్ అడగ్గా... తెలంగాణ వచ్చింది.. అది చాలని సంతోషంతో వృద్ధురాలు చెప్పింది.
ఇదీ చూడండి: రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు: కేటీఆర్