ETV Bharat / state

వ్యవసాయ బావిలో చిరుత.. బయటికి తీసేందుకు విశ్వప్రయత్నం

author img

By

Published : Jan 13, 2021, 4:50 PM IST

వ్యవసాయ బావిలో పడిన చిరుత
వ్యవసాయ బావిలో పడిన చిరుత

ఓ చిరుత వ్యవసాయ బావిలో పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్​లో చోటుచేసుకుంది. అటవీ శాఖ సిబ్బంది చిరుతను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ వద్ద వ్యవసాయ బావిలో చిరుత పడింది. గ్రామస్థుల సమాచారం మేరకు బావి వద్దకు చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది..చిరుతను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వలను బావిలోకి వేసి చిరుతను బయటకు లాగేందుకు కసర‌త్తు చేస్తున్నారు.

వ్యవసాయ బావిలో పడిన చిరుత

ఇవీచూడండి: కొండెక్కిన సంక్రాంతి సరకులు.. 50%పైగా పెరిగిన ఖర్చు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.