ETV Bharat / state

విద్యుదాఘాతానికి గురై మూడు ఎద్దులు మృతి

author img

By

Published : Jun 10, 2021, 1:15 PM IST

ఎర్తింగ్ వైర్​కు కరెంటు సప్లై కావడంతో 3 ఎద్దులు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని గ్రామస్థులు ఆరోపించారు.

3 bulls die due to electric shock in Peddapalli district
3 bulls die due to electric shock in Peddapalli district

పెద్దపెల్లి జిల్లా మంథని మండలం లక్కెపూర్ గ్రామ శివారులోని ట్రాన్స్ ఫార్మర్ దగ్గర ఎర్తింగ్ వైర్​కు కరెంటు సప్లై కావడంతో 3 ఎద్దులు మృతి చెందాయి. గుమ్మునూరు గ్రామానికి చెందిన మొతె శంకర్​కు చెందిన రెండు ఎడ్లు, మరొకటి అదే గ్రామానికి చెందిన జంజర్ల శ్రీనివాస్ కు చెందినదిగా గుర్తించారు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలన ఇద్దరు రైతులకు సుమారు లక్షా 50 వేల రూపాయల నష్టం జరిగిందని గ్రామ సర్పంచ్ మిట్ట సత్యనారాయణ అన్నారు. విద్యుత్ శాఖ ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారికి సాయం అందించాలని, లేకుంటే రైతులతో కలసి సబ్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి.. మిత్రులతో ఆ పని చేయాలని భార్యను వేధించి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.