ETV Bharat / state

మున్ముందు భాజపా భూస్థాపితం కావడం ఖాయం: ఇంద్రకరణ్​

author img

By

Published : May 2, 2021, 7:57 PM IST

trs celebrations in nirmal winning in sagar
నిర్మల్​లో తెరాస సంబురాలు

గులాబీ శ్రేణుల్లో మరోసారి పండుగ వాతావరణం నెలకొంది. నాగార్జున సాగర్​ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి నోముల భగత్.. సమీప అభ్యర్థి జానారెడ్డిపై భారీ మెజారిటీతో విజయం సాధించడంతో పార్టీలో సంబురాలు అంబరాన్నంటాయి. నిర్మల్​లో మంత్రి ఇంద్రకరణ్​తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకలు జరుపుకున్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్నే ప్రజలు బలపరుస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భాజపా భూస్ధాపితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. సాగర్​ ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి నోముల భగత్​ విజయాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు.

సీఎం కేసీఆర్​ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల విజయం, తాజాగా సాగర్ ఉప ఎన్నికలో గెలుపే కేసీఆర్​కు ప్రజాదరణ పెరిగిందనడానికి ఉదాహరణ అని కొనియాడారు.

ఇదీ చదవండి: నాగార్జున సాగర్​లో జోరు తగ్గని కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.