ETV Bharat / state

'మునుగోడు ప్రజలకు పేలాలు పెట్టి.. రాజగోపాల్ రెడ్డి బిర్యానీ తింటున్నారు'

author img

By

Published : Oct 30, 2022, 4:43 PM IST

Madhuyaski Goud Fires on Rajagopal Reddy: రాజకీయ లబ్ధి, తన కంపెనీ లాభాల కోసమే రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరారని.. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ అన్నారు. కాంట్రాక్టుల కోసం నెలల తరబడి భాజపా సర్కార్‌కు, రాజగోపాల్‌రెడ్డికి మధ్య చర్చలు జరిగాయని ఆరోపించారు.

Madhuyaski
Madhuyaski

Madhuyaski Goud Fires on Rajagopal Reddy: మునుగోడు ప్రజలకు పేలాలు పెట్టి.. రాజగోపాల్ రెడ్డి బిర్యానీ తింటున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ విమర్శించారు. చిల్లి గవ్వలేని తన కంపెనీ అభివృద్ది కోసమే రాజగోపాల్​రెడ్డి భాజపాలో చేరారని ఆరోపించారు. ఆపరేషన్ బొగ్గు పేరుతో డాక్యుమెంట్‌ను విడుదల చేసిన మధుయాష్కీ.. బొగ్గు కుంభకోణం వివరాలు బయటపెడుతున్నట్లు తెలిపారు. నష్టాల్లో ఉన్న సుశీ ఇన్​ఫ్రా కంపెనీకి రూ.18 వేల కాంట్రాక్టు ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు.

రాజగోపాల్​రెడ్డి భాజపాలో చేరినందుకే చంద్రగుప్త బొగ్గు గని టెండర్ పొందారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి రాజకీయమంతా బ్యాక్ డోర్ లాబీయింగ్‌గా ఆయన అభివర్ణించారు. మునుగోడులో ప్రజల స్థితిగతులు మారాలి కానీ నాయకులది కాదని పేర్కొన్నారు. ప్రజలు ఆలోచించి మునుగోడులో ఓటు వేయాలని సూచించారు. బడుగు బలహీన వర్గాలు ఏకం కావాలని.. మునుగోడు ప్రజలు తెరాస, భాజపాల దవడ తిరిగేలా తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

"మునుగోడు ప్రజలకు డబ్బు ఎర వేయాలని రాజగోపాల్‌రెడ్డి యత్నిస్తున్నారు. మునుగోడు ప్రజలకు పేలాలు పంచి.. రాజగోపాల్‌రెడ్డి బిర్యానీ తింటున్నారు. నష్టాల్లో ఉన్న తన కంపెనీకి భాజపా కాంట్రాక్టు ఇచ్చింది. అదానీకి ఇచ్చిన ప్రాజెక్టును రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రాకు కట్టబెట్టారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం రాజగోపాల్‌రెడ్డితో బేరసారాలు జరిగాయి. రాజగోపాల్‌రెడ్డికి కాంట్రాక్టు విషయమై ఆధారాలతో చూపిస్తున్నాం. రాజకీయ లబ్ధి, తన కంపెనీ లాభాల కోసం రాజగోపాల్‌రెడ్డి పని చేశారు".- మధుయాష్కీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్

'మునుగోడు ప్రజలకు పేలాలు పెట్టి.. రాజగోపాల్ రెడ్డి బిర్యానీ తింటున్నారు'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.