ETV Bharat / state

GHMC Mayor: గాజులరామరంలో మేయర్​ విజయలక్ష్మి

author img

By

Published : Jun 3, 2021, 3:20 PM IST

జీహెచ్​ఎంసీ(GHMC) మేయర్ గద్వాల విజయలక్ష్మి గాజులరామరంలో ఉన్న మూడు చెరువులను పరిశీలించారు. చెరువు కింద ఉన్న వొక్షిత్ ఎన్​క్లేవ్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటైన కాలనీలోకి వర్షపు నీరు వస్తుందని స్థానికులు మేయర్​ దృష్టికి తీసుకెళ్లారు.

ghmc mayor vijayalaxmi
మేయర్​ విజయలక్ష్మి

మేడ్చల్​ జిల్లా గాజులరామరానికి చెందిన రత్నరాజు అనే మహిళ తమ కాలనీలో ఉన్న చెరువు చుట్టు వాకింగ్​ ట్రాక్​ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్​కు ట్వీట్​ చేశారు. గత కొన్నేళ్లుగా చెరువు కబ్జాలకు గురవుతుందని తన ట్వీట్​లో పేర్కొన్నారు. స్పందించిన మంత్రి.. మేయర్, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ రాజును చెరువును పరిశీలించాలని కోరారు. కేటీఆర్​ కోరిక మేరకు జీహెచ్​ఎంసీ మేయర్(GHMC) అధికారులతో కలిసి ఈరోజు గాజులరామరంలో ఉన్న మూడు చెరువులు, మియావాకి పార్కును పరిశీలించారు.

అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. చెరువు కింద ఉన్న వొక్షిత్ ఎన్​క్లేవ్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటైన కాలనీలోకి వర్షపు నీరు వస్తుందని స్థానికులు మేయర్​ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని విషయాలు మీటింగ్​లో చర్చిస్తామని విజయలక్ష్మి తెలిపారు.

ఇదీ చదవండి: Lock Down : సడలింపు సమయంలో కిటకిట.. లాక్​డౌన్​లో స్తబ్ధత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.