మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రాన్ని అసిస్టెంట్ కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. కేవీకే సమన్వయకర్త డాక్టర్ రాజేశ్వర్ నాయక్ సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. భారీ వర్షాలతో ఈ ఏడాది పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని శాస్త్రవేత్తల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కేవీకేలో సాగవుతున్న మొక్కజొన్న, బంతి, జీలుగు, పొద్దుతిరుగుడు, మినుములు, కంది, చిరుధాన్యాలు, తదితర పంటలను అసిస్టెంట్ కలెక్టర్ పరిశీలించారు. పంటలు సాగవుతున్న విధానాన్ని శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి : ఖాకీల గుప్తనిధుల వేట.. అడ్డంగా దొరికిన ముఠా..