ETV Bharat / state

ఆన్​లైన్​ ప్రచారాన్ని జయప్రదం చేయాలి: ఉత్తమ్

author img

By

Published : May 27, 2020, 3:48 PM IST

Updated : May 27, 2020, 5:10 PM IST

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు గురువారం చేపట్టబోయే ఆన్​లైన్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను నియంత్రించలేకపోయాయని ఉత్తమ్ ఆరోపించారు.

'కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం'
'కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం'

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రతి అసెంబ్లీ పరిధిలో 1500, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుమారు 10 వేల మందికి తగ్గకుండా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనాలన్నారు.

ఆన్​లైన్ ప్రచారాన్ని విజయవంతం చేయాలి ! మోదీ అనాలోచిత నిర్ణయాల వల్లే...

లాక్​డౌన్ అమలులో భాగంగా ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయాల వల్ల వలస జీవులు అగమయ్యారని ఎద్దేవా చేశారు. పూర్తి భద్రతతో, ప్రభుత్వ ఖర్చుతో వారిని వాహనాల్లో సొంత రాష్ట్రానికి చేర్చాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

లాక్​డౌన్ కారణంగా చితికిపోయిన నిరుపేద కుటుంబాలకు రూ.10 వేల రూపాయలను నేరుగా ఖాతాలోకే బదిలీ చేయాలని కోరారు. చిరు వ్యాపారులకు గ్రాంట్స్​తో పాటు ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్​లను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టనున్న ఆన్​లైన్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

'కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం'

ఇవీ చూడండి : మంచిర్యాల జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

Last Updated :May 27, 2020, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.