ETV Bharat / state

Bandi Sanjay: 'పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వ్యక్తి.. సీఎంగా అవసరమా?'

author img

By

Published : Apr 25, 2023, 9:33 PM IST

BJP Unemployment March In Mahabubnagar: బీఆర్​ఎస్​ ప్రభుత్వం కావాలనే తప్పుల తడకన నోటిఫికేషన్​లను ఇచ్చి.. ఆ తప్పులను తనపై నెట్టే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ధ్వజమెత్తారు. మహబూబ్​నగర్​ జిల్లాలో నిర్వహించిన బీజేపీ నిరుద్యోగ మార్చ్​లో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్​పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

bandi sanjay
bandi sanjay

BJP Unemployment March In Mahabubnagar: పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వ్యక్తి సీఎంగా ఎందుకు ఉండాలి.. అన్ని తప్పులకు తానే కారణమైతే.. మరి సీఎంగా కేసీఆర్​ ఎందుకు ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మహబూబ్​నగర్​ జిల్లాలో నిర్వహించిన బీజేపీ నిరుద్యోగ మార్చ్​లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని మల్లికార్జున చౌరస్తా నుంచి ప్రారంభమైన మార్చ్​.. గడియారం కూడలి వరకు​ సాగింది. ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్​ సీఎం కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు.

కేసీఆర్​ కుటుంబం కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నట్లు ఉందని బండి సంజయ్​ విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయనే పోరాటం చేసి.. ఎందరో త్యాగాల ఫలితంగా ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం కావాలనే తప్పుల తడకగా నోటిఫికేషన్లు ఇచ్చారని.. ఆ తప్పులను తనపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జైలుకు వెళ్లేందుకు తాను భయపడనని.. ఇప్పటికే 9 సార్లు జైలుకు వెళ్లానని వివరించారు. ఇప్పటి వరకు ఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని జైలుకు పంపలేదని వెల్లడించారు.

కేటీఆర్​ ఇద్దరే అంటే 50 మందిని ఎందుకు అరెస్ట్​: 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడింది.. ఆ జీవోకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు బీఆర్​ఎస్​ అభ్యర్థిని ఓడించారని బండి సంజయ్​ హర్షం వ్యక్తం చేశారు. లక్షా 90 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్​ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీకి ఇద్దరు మాత్రమే కారణమని మంత్రి కేటీఆర్​ ఎలా చెబుతారని ప్రశ్నించారు. మరి పేపర్​ లీకేజీకి ఇద్దరు మాత్రమే కారణమైతే.. 50 మందిని ఎందుకు అరెస్టు చేశారో తెలపాలని సీఎం కేసీఆర్​కు ప్రశ్నల వర్షం కురిపించారు.

సిట్ వద్దు సిట్​ జడ్జినే ముద్దు:​ మియాపూర్​ భూములపై సిట్​ నివేదిక ఏమైందని బండి ప్రశ్నించారు. నయీం ముఠా అరాచకాలపై వేసిన సిట్​ నివేదిక ఏమైందని.. ఇప్పుడు పేపర్​ లీకేజీ అంశంలో సిట్​ విచారణపై తమకు నమ్మకం లేదని బహిరంగంగా ప్రకటించారు. ఈ కేసును తప్పుదోవ పట్టడానికి ప్రయత్నించిన మంత్రి కేటీఆర్​ను పదవి నుంచి బర్తరఫ్​ చేయాలని సూచించారు. టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీపై సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలని.. ఇదే నిరుద్యోగ యువత మొత్తం కోరుకుంటుందని చెప్పారు. ఈ పేపర్​ లీకేజీ నుంచి రాష్ట్ర ప్రజల చూపు మరల్చడం కోసమే.. పదో తరగతి పేపర్​ లీకేజీ అంశం తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ సందర్భంగా నష్టపోయిన యువతకు రూ. లక్ష పరిహారంగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.