ETV Bharat / state

తల్లిని చంపిన తనయుడు

author img

By

Published : May 1, 2020, 4:55 PM IST

నవ మాసాలు మోసి కనీ పెంచిన తల్లినే ఓ తనయునడు దారుణంగా చంపేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామనపల్లిలో ఈ ఘటన జరిగింది.

తల్లిని చంపిన తనయుడు
తల్లిని చంపిన తనయుడు

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామనపల్లికి చెందిన సెగ్గం మధుకర్​ అనే వ్యక్తి తన తల్లి రాజమ్మను కిరాతకంగా హత్య చేశాడు. రెండు వివాహాలు చేసుకున్న మధుకర్​కు కుటుంబ సభ్యులు దూరంగా ఉంటున్నారు. మద్యానికి బానిసైన అతను డబ్బుల కోసం తల్లి రాజమ్మతో గొడవ పడ్డాడు. ఆ క్షణంలో రోకలి బండతో ఆమె తలపై దాడి చేశాడు.

రక్తపు మడుగులో ఉన్న రాజమ్మను బంధువులు, స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతిచెందింది. ఘటన స్థలాన్ని కాటారం డీఎస్పీ కిషన్, సీఐ హాథీరామ్​లు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహదేవపూర్ ఆసుపత్రికి తరలించామని సీఐ తెలిపారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని... అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.