ETV Bharat / state

T Congress Assembly Ticket Application : నేటి నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్​కు దరఖాస్తు ప్రక్రియ

author img

By

Published : Aug 17, 2023, 2:46 PM IST

Updated : Aug 18, 2023, 9:26 AM IST

T Congress Assembly Ticket Application To Begin On August 18th : రానున్న అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కోసం ఇవాళ్టి నుంచి తెలంగాణ కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుంది? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? దరఖాస్తులో ఏ ఏ అంశాలు పొందు పరచాలి? తదితర అనుమానాలు ఆశావహులను వేదిస్తున్నాయి.
T Congress Assembly Elections 2023
T Congress Assembly Ticket Application

T Congress Assembly Ticket Application To Begin On August 18th : త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ప్రక్రియలో ఇవాళ్టి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు అర్జీలు తీసుకుంటారు. ఇప్పటికే ధరఖాస్తు విధివిధానాలను సబ్ కమిటీ ఖరారు చేసింది. దరఖాస్తుల స్వీకరణ రుసుము విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ధరఖాస్తు చేసుకోవడానికి రూ.25 వేలు, ఓసీలకు రూ.50 వేలు చొప్పున ధరఖాస్తు రుసుము ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

Telangana Congress MLA Ticket Applications : ఆశావహుల కోసం నాలుగు పేజీల ధరఖాస్తును గాంధీభవన్​లో అందుబాటులో ఉంచారు. వ్యక్తిగత వివరాలతో పాటు, ప్రస్తుత పార్టీలో హోదా, గతంలో పార్టీకి చేసిన సేవ, ఇప్పటి వరకు పొందిన పదవులు, గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం, ఎన్నికల్లో గెలుపు ఓటములు, గతంలో ఇతర పార్టీలలో పనిచేసిన అనుభవం, సామజిక మీడియా యాక్టీవిటి, క్రిమినల్ కేసులు, కోర్ట్ శిక్షలతో పాటు పోటీ చేయదలచిన సెగ్మెంట్ తదితర అంశాలను ధరఖాస్తులో పొందుపరచాల్సి ఉంటుంది. అదేవిధంగా గెలిచినా.. ఓడినా పార్టీలోనే ఉంటానంటూ అభ్యర్థుల నుంచి ప్రమాణ పత్రం కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

T Congress Plans for Assembly Elections 2023 : పైరవీలతో కాదు.. ప్రజల్లో ఉంటేనే టికెట్‌.. ప్రజాబలం ఉన్న నేతలకే అవకాశాలు.!

T Congress Assembly Elections 2023 : అర్జీలను తీసుకోడానికి గాంధీభవన్​(Gandhi Bhavan) లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ధరఖాస్తులు స్వీకరణ ముగిసిన తర్వాత కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ స్క్రూటీని చేస్తుంది. దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హులైన అభ్యర్థుల జాబితాను రూపొందించి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కమిటీకి నివేదిస్తారు. ఈ జాబితాను స్క్రీనింగ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే అభ్యర్థులతో నేరుగా మాట్లాడతారు. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు, అభ్యర్థి పోటీ చేయదలిచిన సెగ్మెంట్లోని ప్రత్యర్థుల బలాలు, బలహీనతలు బేరీజు వేసుకుని పార్టీ అధికంగా ఉన్న నియోజకవర్గాల నుంచి మూడేసి పేర్లు సెంట్రల్ ఎన్నికల కమిటీ సిఫారసు చేస్తారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ముందుకు వచ్చిన స్క్రీనింగ్ కమిటీ నివేదికను మరోసారి పరిశీలించి చివరకు సీడబ్ల్యూసీ ఆమోదంతో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.

Telangana Congress Focus On Assembly Elections : అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతేనే ఈ నాలుగంచెల విధానాన్ని అనుసరిస్తారు. అలాంటి నియోజకవర్గ అభ్యర్థుల ప్రకటన చివరి జాబితాలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. నేరుగా ప్రియాంకగాంధీ(Priyanka Gandhi), రాహుల్‌గాంధీలు తెలంగాణ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ(Selection Process of Telangana Candidates), ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నందున టికెట్ల పంపిణీలో గ్రూపులు నడిపేవారి మాటలు చెల్లకపోవచ్చని నేతలు అంచనా. అభ్యర్థుల ఎంపిక విషయంలో పారదర్శకతనే ప్రామాణికమని చెబుతున్న పీసీసీకి పోటీ అధికంగా ఉండడం, సామాజిక న్యాయం పాటించాల్సి ఉండడం తదితరవి తలనొప్పిగా మారుతుందని పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు.

Congress Chevella Public Meeting on 24th August : 24న చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న ఖర్గే

T Congress Assembly Elections 2023 Plan : MLAగా పోటీ చేయాలనుందా​? కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. అప్లై చేసేయండి

Telangana Congress PEC Meeting Today : నేడు తెలంగాణ కాంగ్రెస్​ నేతల కీలక సమావేశం.. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం..!

Last Updated :Aug 18, 2023, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.