ETV Bharat / state

భారత్​లో చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించిన ఐసీఏఆర్​, ఐఐఎంఆర్​

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2023, 7:06 PM IST

Millets Cultivation In India
Indian Government To Increase Millet Cultivation

Indian Government To Increase Millet Cultivation : బహుళ పోషకాహార గనులు చిరుధాన్యాలు. గతకొంతకాలంగా మిల్లెట్స్‌పై ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. చిరుధాన్యాల ప్రోత్సహం దిశగా పెద్దఎత్తున అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 ముగుస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో పంటల సాగు, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించే దిశగా శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టి సారించారు. చిరుధాన్యాలను సాగులో రైతులను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇక్రిశాట్‌, భారత వ్యవసాయ పరిశోధన మండలి -ఐసీఎఆర్​, జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి.

Indian Government To Increase Millet Cultivation భారత్​లో చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించిన ఐసీఏఆర్​ ఐఐఎంఆర్​

Indian Government To Increase Millet Cultivation : దేశ వ్యవసాయ రంగంలో రోజురోజుకు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 60వ దశకంలో విజయవంతమైన హరిత విప్లవం నేపథ్యంలో ఎన్నో మైలురాళ్లు సాధించిన భారత్‌ ప్రధాన ఆహార పంటలైన వరి, గోధుమ, పప్పులు, పండ్లు, కూరగాయలు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది. ఇదే క్రమంలో వ్యవసాయంలో విప్లవాత్మక ఆవిష్కరణలు, కొత్త కొత్త సాంకేతికతలు అమలు చేయడం ద్వారా గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్టైంది.

దేశంలో చిరుధాన్యాల విప్లవంపై దృష్టి సారించిన కేంద్రం

మొదట ఆసియా, ఆఫ్రికాలో ఖండాల్లో సాగైనా తర్వాత అభివృద్ధి చెందుతోన్న దేశాల్లోకి తృణధాన్యాల పంటలుగా వ్యాప్తి చెందాయి. 2021-22లో ప్రపంచవ్యాప్తంగా 75.35 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో చిరుధాన్యాల పంటలు సాగు చేయగా ఉత్పత్తి 97.15 మిలియన్ మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చినట్టు ఎఫ్​ఏవో వెల్లడించింది. వీటిలో జొన్న, సజ్జ ప్రధాన పంటలు కాగా తర్వాతి స్థానంలో రాగి ఆ తర్వాత కొర్రలు, వరిగెలు, ఊదలు, అరికెలు వంటివి ఉన్నాయని ప్రపంచ ఆహార సంస్థ అంచనా వేసింది. ముఖ్యంగా భారత్‌లో చిరుధాన్యాలను రోజు వారీ ఆహారంలో భాగం చేయాలని నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.

తృణధాన్యాల విత్తనాలకు పెరిగిన డిమాండ్

వాతావరణ మార్పులు అనేక దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిర వర్షపాతం, కరవుల వల్ల పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ తరుణంలో చిరు ధాన్యాల సాగును విస్తృతంగా చేపట్టడం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 140 కోట్లకు పైగా ఉన్న భారత జనాభాకు పోషకాహారాన్ని అందించాల్సిన అవసరం ఉందని, అందుకోసం చిరు ధాన్యాల సాగును భారీగా చేపట్టాలని చెబుతున్నారు. ఆహార భద్రతతోపాటు పోషకాల పరంగానూ ఎంతో ప్రాధాన్యం ఉన్న చిరుధాన్యాల సాగును పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి.

Millets Cultivation In India : ఆహారంలో భాగం చేసి చిరుధాన్యాలు ఉత్పత్తులను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మిల్లెట్ కేఫ్‌ల ఏర్పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అంతేకాకుండా రాబోయే కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయా పంటల సాగు విస్తీర్ణం పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో భారత్‌ చిరుధాన్యాలకు హబ్‌గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

చిరుధాన్యాల కోసం జీవవైవిద్య పరిరక్షణ ఉద్యమం: డీడీఎస్​

వరి, గోధుమలతో పోలిస్తే అతి తక్కువ నీటితోనే తృణధాన్యాలను పండించవచ్చు. భారత్‌లో దాదాపు సగం వ్యవసాయ భూములు వర్షాధారమే. అవి తృణధాన్యాల సాగుకు అత్యంత అనుకూలం. పర్యావరణానికీ చిరుధాన్యాల సాగు చాలా అనుకూలం. వరి వల్ల మీథేన్‌ ఉద్గారాలు వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి. ఫలితంగా భూతాపం పెరుగుతోంది. ఆహార భద్రత, పోషకాల పరంగా చిరుధాన్యాల ప్రాధాన్యంపై అవగాహన పెంచాలని, వాటిపై పరిశోధనలను ప్రోత్సహించాలని ఆహార, వ్యవసాయ సంస్థ-FAO నిర్ణయించింది. ఇక్రిశాట్‌ ఆధ్వర్యంలోని భారత తృణధాన్యాల పరిశోధనా సంస్థ-ఐఐఎమ్​ఆర్​ సైతం అధిక దిగుబడినిచ్చే జొన్న సహా వివిధ రకాల వంగడాలను అభివృద్ధి చేసింది

International Millets Year 2023 : అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 డిసెంబరు 31వ తేదీతో ముగుస్తున్న దృష్ట్యా... రాబోయే రోజుల్లో చిరుధాన్యాలను ప్రజలకు ఎలా చేరువచేయాలి అనే అంశంపై శాస్త్రవత్తలు హైదరాబాద్‌ వేదికగా చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ డిక్లరేషన్ ప్రకటించిన ఐసీఏఆర్​, ఐఐఎమ్​ఆర్​ దేశ్యాప్తంగా 220 రకాల వంగడాలను సిద్ధం చేసింది. వీటి వల్ల హెక్టారుకు 7 నుంచి 8 టన్నుల దిగుబడులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ ఏడాది 5.8 లక్షల టన్నులు విత్తనాలు సిద్ధంగా పెట్టింది. రాబోయే ఐదేళ్లల్లో అధిక దిగుబడులు ఇచ్చే బ్రీడర్‌, ఫౌండేషన్ విత్తనాల పరిశోధనలు విస్తృతం చేసి రైతులకు అందించాలని నిర్ణయించింది.

చిరుధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం

ప్రపంచంలో చిరుధాన్యాలు ఎగుమతి చేసే ముఖ్యమైన ఐదు దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ప్రపంచ తృణధాన్యాల ఉత్పత్తిలో 20శాతం, ఆసియాలో 80శాతం వాటాను ఇండియా కలిగి ఉంది. అంతర్జాతీయంగా చిరుధాన్యాలకు డిమాండ్‌ పెరుగుతున్నందు వల్ల ఎగుమతులకు విస్తృత అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నాణ్యమైన ఉత్పత్తులు, వాటికి విలువ జోడింపు, మార్కెటింగ్‌ వంటివాటిని బలోపేతం చేయాలి. ముఖ్యంగా రైతులకు మార్కెటింగ్‌ సదుపాయాలను పెంచడం తప్పనిసరి. మద్దతు ధరలను ప్రకటించి ప్రభుత్వాలే అన్నదాతల నుంచి తృణధాన్యాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది.

ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం.. అసలు వీటితో ఎంత మేలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.