ETV Bharat / state

చిరుధాన్యాల కోసం జీవవైవిద్య పరిరక్షణ ఉద్యమం: డీడీఎస్​

author img

By

Published : Dec 31, 2019, 7:01 PM IST

చిరుధాన్యాల పరిరక్షణ కోసం పక్కా ప్రణాళికతో జీవ వైవిధ్య పరిరక్షణ ఉద్యమాన్ని కొససాగిస్తామని డీడీఎస్​ డైరెక్టర్​ పీవీ సతీష్​ తెలిపారు. జనవరి 3న రాష్ట్రపతి భవన్​లో జరిగే జీవ వైవిధ్య వ్యవసాయంపై చర్చలో పాల్గోనున్నట్లు తెలిపారు.

dds director sateesh speaks on millets productions
చిరుధాన్యాల కోసం జీవవైవిద్య పరిరక్షణ ఉద్యమం: డీడీఎస్​

చిరుధాన్యాల పరిరక్షణ కోసం 2020 ప్రణాళికతో జీవ వైవిధ్య పరిరక్షణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని డెక్కన్ డెవలప్​మెంట్​ సొసైటి డైరెక్టర్ పీవీ సతీష్​ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్ డీడీఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్లుగా చేసిన పోరాటానికి ఫలితంగా పర్యావరణ నోబెల్​గా పిలిచే ఐరాస ఈక్విటార్ అవార్డు రావడం సంతోషకరమన్నారు.

జనవరి 3న రాష్ట్రపతి భవన్​లో జరిగే జీవ వైవిధ్య వ్యవసాయంపై చర్చలో పాల్గొనే అవకాశం వచ్చిందని తెలిపారు. 2020 సంవత్సరంలో సేంద్రియ వ్యవసాయం, చిరుధాన్యాల పరిరక్షణపై గ్రామ స్థాయి నుంచి అందరిని జాగృతం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భూసారాన్ని కలుషితం చేసే పత్తి లాంటి పంటల సాగును కట్టడి చేసి.. సుస్థిర సేంద్రీయ జీవ వైవిధ్య వ్యవసాయం చేసేలా రైతులను సమాయత్తం చేస్తామని సతీష్​ తెలిపారు.

చిరుధాన్యాల కోసం జీవవైవిద్య పరిరక్షణ ఉద్యమం: డీడీఎస్​

ఇవీచూడండి: హ్యాపీ న్యూయర్ అంటూ మదిని మైమరపించే పూల బొకేలు

Intro:tg_srd_27_31_millets_2020_agenda_vo_ts10059
( ).... చిరుధాన్యాల పరిరక్షణ కోసం 2020 ప్రణాళికతో జీవ వైద్య పరిరక్షణ ఉద్యమాన్ని కొనసాగించనున్నట్లు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ పి వి సతీష్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్లో ని డిడిఎస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత 30 ఏళ్ల పాటు పల్లె నుంచి ప్రపంచ ఖ్యాతి వచ్చేందుకు చేసిన పోరాటానికి పర్యావరణ నోబెల్ గా పిలిచే ఐరాస ఈక్విటార్ అవార్డు రావడం సంతోషకరమన్నారు. దీంతోపాటు జనవరి 3న రాష్ట్రపతి కార్యాలయం లో జరిగే జీవవైవిధ్య వ్యవసాయంపై చర్చలో పాల్గొనే అవకాశం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 2020 సంవత్సరం లో పల్లె నుంచి ప్రపంచం వరకు సేంద్రియ వ్యవసాయం చిరుధాన్యాల పరిరక్షణ పై గ్రామ సర్పంచ్ నుంచి అధికారుల వరకు జాగృతం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం జనవరి 3న డివిజన్ స్థాయి సర్పంచులకు వ్యవసాయం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. భూసారాన్ని కలుషితం చేసే పత్తి లాంటి పంటల సాగును కట్టడి చేస్తూ సుస్థిర సేంద్రీయ జీవవైవిధ్య వ్యవసాయం పరిరక్షణ కోసం పాటుపడే లా పని చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
vis... byte...
పీ.వీ. సతీష్, డీడీస్ డైరెక్టర్


Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా


Conclusion:8008573254

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.