ETV Bharat / state

చిరుధాన్యాలే నేటికాలంలో సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా

author img

By

Published : Jan 10, 2023, 8:22 PM IST

Millets awarness programme in hanmakonda: హన్మకొండలో ఎస్సార్ యూనివర్సిటీలో చిరుధాన్యాలపై ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు అపూర్వ స్పందన లభించింది. చిరుధాన్యాల లాభాలపై విద్యార్థులకు పోషకాహార నిపుణులు అవగాహన కల్పించారు.

చిరుధాన్యాలపై అవగాహన కార్యక్రమం
చిరుధాన్యాలపై అవగాహన కార్యక్రమం

Millets awarness programme in hanmakonda: హన్మకొండలో ఎస్సార్ యూనివర్సిటీలో చిరుధాన్యాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మారుతున్న కాలానుగుణంగా యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. చిరుధాన్యాలను తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవచ్చునని తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఇంటి వద్ద చిరుధాన్యాలతో స్వయంగా తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకొచ్చి ప్రదర్శించారు. విద్యార్థులు తెచ్చిన ఆహార పదార్థాలను కళాశాల అధ్యాపకులు, పోషకాహార నిపుణులు తిని బాగుందని మెచ్చుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.