ETV Bharat / state

నేడు తెలంగాణభవన్‌లో బీఆర్​ఎస్​ శాసనసభాపక్షా భేటీ - శాసనసభాపక్ష నేతగా కేసీఆర్​ను ఎన్నుకునే అవకాశం!

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2023, 6:43 PM IST

Updated : Dec 9, 2023, 7:00 AM IST

BRS Legislature Meeting tommorrow
BRS Legislature Meeting at Telangana Bhavan

BRS Legislature Meeting at Telangana Bhavan : ఈరోజు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్​లో బీఆర్​ఎస్​ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. ఈ సమావేశంలో భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. శాసనసభాపక్ష నేతగా కేసీఆర్​ను ఈ సమావేశంలో ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం.

BRS Legislature Meeting at Telangana Bhavan : నేడు బీఆర్ఎస్ (BRS) శాసనసభ పక్షం సమావేశం కానుంది. తెలంగాణ భవన్‌లో ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 39 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలుగా ఎన్నిక అయ్యారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నందున మిగతా ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరుకానున్నారు. భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేతగా కేసీఆర్​ను సమావేశంలో ఎన్నుకునే అవకాశం ఉందని తెలిసింది. అదేవిధంగా స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమావేశం తర్వాత అందరూ కలిసి అసెంబ్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ

ప్రొటెం స్పీకర్​గా అక్బరుద్దీన్ ఓవైసీ : ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ 64 స్థానాల్లో గెలుపొంది అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. హైదరాబాద్​, రంగారెడ్డి, మెదక్​ మినహా మిగతా గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. రేవంత్​రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు రేపటి నుంచి శాసన సభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్​గా అక్బరుద్దీన్​ ఓవైసీ (Akbaruddin Owaisi) ఎన్నికయ్యారు.

ప్రొటెం స్పీకర్​గా సభలో సీనియర్​ శాసనసభ సభ్యుడు ఎవరైతే ఉంటారో వారే ఈ స్థానంలో ఉంటారు. అయితే ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్​, ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తలసాని శ్రీనివాస్​ యాదవ్​, దానం నాగేందర్​, పోచారం శ్రీనివాస్​ రెడ్డి ఉన్నారు. ఎంఐఎం నుంచి ఆరుసార్లు గెలుపొందిన అక్బరుద్దీన్​ ఒవైసీ ఉన్నారు. కాంగ్రెస్​ వైపు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆరుసార్లు ఎన్నికై ఉన్నారు.

బీఆర్​ఎస్​ నేతలు, కార్పొరేటర్లకు తన పేరుతో బెదిరింపు ఫోన్‌కాల్స్‌ చేస్తున్నారు : మర్రి రాజశేఖర్​రెడ్డి

Former CM KCR Admitted to Yashoda Hospital : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR) ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గురువారం రాత్రి జారిపడటంతో ఎడమ తుంటి భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో ఆయనకు తెల్లవారుజామున సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. పరీక్ష చేసిన వైద్యులు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అనంతరం శుక్రవారం సాయంత్రం విజయవంతంగా ఆపరేషన్‌ పూర్తి చేశారు. సీనియర్‌ వైద్యుల బృందం ప్రత్యేక పర్యవేక్షణలో దాదాపు నాలుగు గంటలకుపైగా ఈ సర్జరీ జరిగింది.

ప్రధాని మోదీ సహా పలు రాజకీయ పక్షాల నాయకులు కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్పందించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీని యశోద ఆసుపత్రికి పంపి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వాకబు చేశారు. ఆయనకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు ముఖ్యమంత్రి సూచించారు. అటు శస్త్రచికిత్స అనంతరం కోలుకునేందుకు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని, అంతవరకు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు

సీఎం హోదాలో తొలిసారి దిల్లీకి రేవంత్​ రెడ్డి

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు - 11 గంటలకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం

Last Updated :Dec 9, 2023, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.