ETV Bharat / state

సీఎం హోదాలో తొలిసారి దిల్లీకి రేవంత్​ రెడ్డి - మల్కాజ్​గిరి ఎంపీగా రాజీనామా

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2023, 2:59 PM IST

Updated : Dec 8, 2023, 10:43 PM IST

CM Revanth Reddy Delhi Tour Today : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి దిల్లీ వెళ్లారు. సీఎం హోదాలో ఇలా దిల్లీ వెళ్లడం ఇదే మొదటిసారి. ఎమ్మెల్యేగా రేపు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం ఉన్నందున తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. లోక్​ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా అందజేయనున్నారు. వీటితో పాటు మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్ఠానంతో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి చర్చించనున్నారు.
సీఎం హోదాలో తొలిసారి దిల్లీకి రేవంత్​ రెడ్డి
CM Revanth Reddy Delhi Tour Today

CM Revanth Reddy Delhi Tour Today
రేవంత్​ రెడ్డి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా

CM Revanth Reddy Delhi Tour Today : తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి దిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి సీఎం హోదాలో ఆయన హస్తిన పర్యటన సాగుతోంది. ముందుగా లోక్ సభ స్పీకర్​ ఓం బిర్లాతో(Lok Sabha Speaker Om Birla) సమావేశం కానున్నారు. అనంతరం మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్ఠానంతో రేవంత్​ రెడ్డి చర్చించనున్నారు. పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో చర్చించనున్నారు.

ప్రజాదర్బార్​కు విశేష స్పందన- సేవను మించిన తృప్తి లేదంటూ సీఎం ఎమోషనల్​ ట్వీట్

పార్లమెంటు సభ్యత్వారని రేవంత్​ రెడ్డి రాజీనామా : దిల్లీ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి లోక్​సభ స్పీకర్ ఓం బిర్లాను వ్యక్తిగతంగా కలవనున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి, ఆ రాజీనామాను లోక్​సభ స్పీకర్​కు సమర్పించనున్నారు. అనంతరం ఏఐసీసీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ను కలిశారు. ఆయనతో భేటీ అయిన అనంతరం తిరిగి హైదరాబాద్​ బయలుదేరి రానున్నారు.​

CM Revanth Reddy Released Open Letter : సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి, దిల్లీలో తన ఎంపీ(Member of Parliament) పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రశ్నించే గొంతుకకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజ్​గిరి అని పేర్కొన్నారు. ఈ రోజు మీ రేవంతన్న సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డపై జెండా ఎగురువేసిందంటే దానికి పునాదులు పడింది మల్కాజ్​గిరిలోనేనని అంటూ ఆయన ఎక్స్​(ట్విటర్​) వేదికగా చెప్పుకొచ్చారు.

రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు - ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం

తల్లి తన బిడ్డను దేశ రక్షణ కోసం పంపినట్టు, తనను నియోజకవర్గ ప్రజలు తెలంగాణ రక్షణ కోసం గెలిపించి పంపారన్నారు. ఇన్నాళ్లు ఆ బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వర్తించానని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో కొడంగల్​కు ఎంతటి ప్రాధాన్యతో ఉందో, మల్కాజ్​గిరికి అంతే ప్రాధాన్యత ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌(Congress Party) అధికారంలోకి రావడానికి కారణం మల్కాజ్‌గిరి నియోజకవర్గ ప్రజలేనని రేవంత్‌రెడ్డి పలికారు. తానెప్పటికీ మల్కాజ్‌గిరికి రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. చివరి శ్వాస వరకు రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం తపిస్తానని ఎక్స్​ వేదికగా తెలిపారు.

  • లోక్ సభ సభ్యత్వానికి నేడు రాజీనామా చేశాను.

    ఈ రాజీనామా నా ఎంపీ పదవికి మాత్రమే…
    నా మనసులో మల్కాజ్ గిరి ప్రజల స్థానం శాశ్వతం.

    ప్రశ్నించే గొంతుకగా నన్ను పార్లమెంటుకు పంపిన ఇక్కడి ప్రజలతో నా అనుబంధం శాశ్వతం.

    చివరి శ్వాస వరకు అటు కొడంగల్,
    ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి.… pic.twitter.com/CyQT0gKKnU

    — Revanth Reddy (@revanth_anumula) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఉద్యమకారుల కేసులపై వివరాలు సేకరించాలని సీఎం ఆదేశం : తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసుల వివరాలు సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి, సీఐడీ అధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో 2009 డిసెంబర్ 9 నుంచి 2014 జూన్ 2 వరకు నమోదైన కేసుల వివరాలను సీఐడీ(CID) సేకరించే పనిలో పడింది. ఆ సమయంలో జైలుకెళ్లిన ఉద్యమకారుల వివరాలు ఇవ్వాలని సీఐడీ అదనపు డీజీ, అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశించారు.

వెన్నుచూపని వీరుడు, జనాదరణ పొందిన నాయకుడు - తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ కొత్త సీఎం అనుముల రేవంత్‌ రెడ్డి - జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రస్థానం సాగిందిలా

Last Updated :Dec 8, 2023, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.