ETV Bharat / state

BJP MLA Candidates Selection Telangana 2023 : ఎమ్మెల్యే టికెట్‌కు ఆశావహుల నుంచి బీజేపీ దరఖాస్తులు స్వీకరణ

author img

By Telangana

Published : Sep 1, 2023, 9:29 PM IST

Updated : Sep 1, 2023, 10:41 PM IST

BJP Notification MLA CANDIDATES FOR ELECTIONS
Telangana Assembly Elections 2023

21:25 September 01

BJP MLA Candidates Selection Telangana 2023

BJP MLA Candidates Selection Telangana 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రతి పార్టీ సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ అభ్యర్థుల టికెట్లను దాదాపుగా ఖరారు చేసింది. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్​ అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఇటీవలే పూర్తి చేసింది. తాజాగా రాష్ట్రంలో మరో ప్రధాన పార్టీ అయిన బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) టికెట్​కు ఆశావహుల నుంచి దరఖాస్తు స్వీకరణకు ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి నేతృత్యంలోని కమిటీ దరఖాస్తులు తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ సెప్టెంబర్​ 4 నుంచి 10వ తేదీ వరకు కొనసాగనుంది. అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.

Congress MLA Candidates Selection Telangana : రాష్ట్రంలో షెడ్యూల్​ ప్రకారం ఈ సంవత్సరం డిసెంబరు నెలలో శాసనసభ ఎన్నికలు(Assembly Elections) జరగాలి. దీనికోసం పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను మొదలుపెట్టాయి. కాంగ్రెస్​ పార్టీ 119 నియోజక వర్గాలకు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈ ప్రక్రియను గత నెల 29తో ముగించింది. సుమారు 1017 దరఖాస్తులు వచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 34 నియోజక వర్గాల్లో 10 కన్నా ఎక్కువ అర్జీలు వచ్చాయని వెల్లడించింది. మరికొన్ని నియోజక వర్గాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. దీంతో ఆ పార్టీ ప్రధాన నాయకులు టికెట్​ ఎవరికి ఇవ్వాలో పరిశీలిస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయి నాయకులతో చర్చలు జరిపింది. టికెట్లు కేటాయించే విషయంలో బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్​ నాయకులు తెలిపారు. ఇది ఇలా ఉంటే కొన్నిచోట్ల ఏకగ్రీవంగా వ్యక్తులను నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఉన్న నాయకుల మధ్య వాగ్వాదాలను తొలగించే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలకు కాంగ్రెస్​ అభ్యర్థులను పోటీ చేసే విధంగా పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని పలువురు నాయకులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్​ బలమైన వ్యూహాలు అమలు చేస్తోందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల ప్రజాగర్జన సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ను ప్రకటించింది.

Amit Shah Khammam Tour Schedule : ఖమ్మం 'రైతు గోస-బీజేపీ భరోసా' సభకు ముఖ్య అతిథిగా అమిత్​ షా.. షెడ్యూల్​ ఇదే

BJP BUS Yatra in Telangana : రాబోయే అసెంబ్లీ ఎన్నికలను గెలిచేందుకు బీజేపీ బలమైన వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ అభివృద్ధి.. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రజా సంగ్రామ యాత్ర మాదిరిగా బస్సు యాత్రకు సన్నద్ధం అవుతోంది. ఈ యాత్ర ఉమ్మడి పది జిల్లాలో చేయనుంది. వాటని మూడు క్లస్టర్లుగా విభజించి.. పార్టీలో ప్రముఖ నాయకుల ఆధ్వర్యంలో చేయనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్​ 2వ తేదీ వరకు బస్సు యాత్ర ద్వార ప్రజల సమస్యలు తెలుసుకోనుంది. అదే విధంగా ఆయా ప్రాంతాల్లో నాయకులను గుర్తించడం.. కార్యకర్తల్లో ఉత్సహాన్ని నింపడం.. తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది.

BJP Bus Yatra in Telangana : సెప్టెంబర్ 17 నుంచి బీజేపీ బస్సు యాత్ర.. 3 మార్గాలు ఖరారు

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ.. ఆ స్థానాల్లో గెలుపే టార్గెట్​!

Telangana BJP 2023 Elections Plan : 'పార్టీ బలహీనంగా ఉన్న చోట త్వరితగతిన బలోపేతం చేయాలి'

Last Updated : Sep 1, 2023, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.