ETV Bharat / state

Amit Shah Khammam Tour Schedule : ఖమ్మం 'రైతు గోస-బీజేపీ భరోసా' సభకు ముఖ్య అతిథిగా అమిత్​ షా.. షెడ్యూల్​ ఇదే

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2023, 3:37 PM IST

Updated : Aug 25, 2023, 4:09 PM IST

Union Home Minister Amit Shah SUNDAY Schedule
Amit Shah Telangana Tour Schedule

Amit Shah Khammam Tour Schedule : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా మరోమారు తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగే 'రైతు గోస-బీజేపీ భరోసా' సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Amit Shah Khammam Tour Schedule : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మంలో నిర్వహించే 'రైతు గోస-బీజేపీ భరోసా' సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి హెలికాప్టర్​లో 2 గంటల 10 నిమిషాలకు కొత్తగూడెం చేరుకోనున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకుంటారు. 2.25 గంటల నుంచి 2.40 గంటల వరకు భద్రాద్రి రాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కొత్తగూడెం నుంచి 2.55 గంటలకు బీఎస్ఎఫ్ హెలికాప్టర్​లో బయలుదేరి 3.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు.

Amit Shah: 'రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం'

Amit Shah Telangana Tour Schedule : 3.45 గంటల నుంచి 4.45 గంటల వరకు గంట పాటు బహిరంగ సభలో పాల్గొని బీఆర్​ఎస్​ సర్కారు వైఫల్యాలపై విమర్శనాస్త్రాలు సంధించనున్నారు. సభ అనంతరం రాష్ట్ర ముఖ్య నేతలతో గంటపాటు రాష్ట్ర రాజకీయాలపై చర్చిస్తారు. దీంతో పాటు ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 5.45 గంలకు హెలికాప్టర్​లో బయలుదేరి.. గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 6.20 గంటలకు దిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

Rythu Gosa BJP Bharosa Meeting in Khammam : రాష్ట్రంలో రైతుల సమస్యలకు, కౌలు రైతుల కన్నీటికి బీఆర్​ఎస్​ ప్రభుత్వమే కారణమని.. బీజేపీ అధికారంలోకి వస్తే అన్నదాతల సంక్షేమానికి సమగ్ర చర్యలు చేపడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రైతుల కోసం బీజేపీ చేసే విషయాలను తెలిపేందుకు ఆగస్టు 27న ఖమ్మం జిల్లాలో రైతు గోస-బీజేపీ భరోసా పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు అమిత్​ షా ముఖ్య అతిథిగా వస్తున్నారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సభలో రైతుల పట్ల తమ పార్టీ వైఖరిని ప్రకటిస్తామని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. రైతాంగాన్ని మోసం చేస్తున్న కేసీఆర్​ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేస్తోందని వెల్లడించారు. కేసీఆర్​ సర్కార్​ సమగ్ర బీమా పథకం అమలు చేయకుండా మరిన్ని సమస్యలు తలెత్తేలా చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి అన్నదాతలను ఆగమాగం చేస్తున్నారని విమర్శించారు. రుణాలకు వడ్డీ మీద వడ్డీ పెరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతుల జీవితాలను చీకట్లోకి నెట్టిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్​దేనని ఎద్దేవా చేశారు.

Amit Shah Tour Cancelled : రాష్ట్రంలో అమిత్ షా పర్యటన వాయిదా.. అదే కారణం!

Amit Shah Telangana Tour : ఈనెల 29న తెలంగాణకు అమిత్ షా.. ఆ అంశాలపై నేతలతో చర్చ.!

Amit shah Telangana Tour Cancel : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు

Last Updated :Aug 25, 2023, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.