ETV Bharat / state

'శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాము.. ఎవరితో పొత్తు ఉండదు'

author img

By

Published : Apr 1, 2023, 7:55 PM IST

Bandi Sanjay Angry With BRS And Congress: ఈ ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్​ కలిసి పోటీ చేస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపణలు చేశారు. బీజేపీ మాత్రం ఒంటరిగానే ఈసారి బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

bandi sanjay
bandi sanjay

Bandi Sanjay Angry With BRS And Congress: వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​లకు తోడుగా సూది తబ్బలంలా.. ఇంకా మరికొన్ని పార్టీలు పోటీ చేస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ జోస్యం చెప్పారు. హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలపై విమర్శలు చేశారు. ఈ సమావేశంలో పార్టీ కొంత మంది నేతలు పాల్గొన్నారు.

ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​తో కాంగ్రెస్​కు పొత్తు ఉంటుందని కాంగ్రెస్​ పార్టీలోని ముఖ్య నేతలే బహిరంగంగా చెప్పుతున్నారని బండి సంజయ్​ తెలిపారు. ఇదే విషయంపై గతంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇప్పుడు జానారెడ్డి చెప్పారని అన్నారు. ఎవరు ఎంతమందితో కలిసి పోటీ చేసినా సరే.. బీజేపీ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు.

షర్మిల ఫోన్​ చేసిన మాట వాస్తవమే: నిరుద్యోగుల సమస్యపై ప్రతిపక్షాలతో కలిసి పని చేయాలని చెప్పి వైఎస్సాఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల తనకు ఫోన్​ చేసింది వాస్తవమే అని చెప్పారు. పార్టీతో చర్చించిన తర్వాతనే ఉమ్మడి కార్యాచరణకు మద్దతు ఇస్తామని ఆమెతో చెప్పానన్నారు. కాంగ్రెస్​ ఉంటే తాము పోరాటానికి రాలేమని చెప్పానని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు. ఉచిత యూరియా ఇస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్​ మీద ఉన్న ఆరోపణలు అన్నీ తమకు తెలుసునని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడానికి.. మహారాష్ట్ర రైతులను తీసుకుని వచ్చి బీఆర్​ఎస్​లో చేర్చుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

కేసీఆర్​ తమ పిల్లలను కాపాడుకునేందుకు ఆహర్నిశలు కష్టపడుతున్నారు: టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసు గురించి స్పందిస్తూ.. అసలు కమిషన్​ను రద్దు చేయాలని సూచించారు. ఈ కేసును సిట్టింగ్​ జడ్జితో విచారణ చేపట్టేందుకు ఎందుకు భయపడుతున్నారని.. అయినా ఇప్పటివరకు కమిషన్​ను రద్దు చేయకపోవడానికి మీకున్న ఇబ్బందులు ఏంటో చెప్పండని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్​ ఇద్దరి పాత్ర మాత్రమే ఉందని చెప్పారు కదా.. మరి ఇప్పుడు ఇంతమంది ఎలా వచ్చారని ప్రశ్నించారు. 30 లక్షల మంది జీవితాలకు సంబంధించిన అంశంపై సీఎం మాట్లాడకపోవడం వింతగా ఉందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్​ తన పిల్లలను కాపాడుకునే పనిలో ఉన్నారని.. మరి రాష్ట్రాన్ని ఇంకా ఎందుకు కాపాడుతారని ధ్వజమెత్తారు.

"సుఖేశ్‌ చంద్రశేఖర్ వ్యవహారం దృష్టి మళ్లించడానికి కొందరు రైతులను పిలిపించుకుని బీఆర్​ఎస్​లో చేర్చుకున్నారు. టీఎస్‌పీఎస్సీ కమీషన్‌ను రద్దు చేయాలి. సిట్టింగ్ జడ్జి విచారణకు ఎందుకు భయపడుతున్నారు. బిడ్డ, కొడుకును కాపాడేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారు." - బండి సంజయ్​, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాము.. ఎవరితో పొత్తు ఉండదు: బండి సంజయ్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.