ETV Bharat / sports

స్వదేశానికి భారత​ బృందం.. అభిమానుల ఘనస్వాగతం

author img

By

Published : Aug 9, 2021, 8:08 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో అత్యుత్తమ ప్రదర్శన అనంతరం భారత బృందం (indian olympic contingent) స్వదేశానికి చేరుకుంది. వీరికి దిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది.

Indian Olympic Contingent
భారత ఒలింపిక్ బృందం

టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics)​ నుంచి భారత బృందం (indian olympic contingent) స్వదేశానికి చేరుకుంది. దిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో వారికి స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (సాయ్​) (SAI) డైరెక్టర్​ జనరల్​ సందీప్​ ప్రధాన్​, అథ్లెటిక్స్​ ఫెడరేషన్​ ఆఫ్ ఇండియా చీఫ్​ అదిల్లే సుమరివాలా ఘనస్వాగతం పలికారు. అథ్లెట్ల కుటుంబ సభ్యులతో పాటు స్థానిక రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. డోలు​ చప్పుళ్లతో, బ్యాండ్లు కొడుతూ, పాటలు పాడుతూ త్రివర్ణ పతాకాన్ని చేతబూని పలువురు డ్యాన్స్​లు చేశారు.

పతక విజేతలను చూడటానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున రావడం వల్ల ఎయిర్​పోర్ట్​ వద్ద కాస్త ఉద్రిక్త వాతవరణం నెలకొంది. చాలా మంది మాస్క్​లు లేకుండానే వచ్చారు. భౌతిక దూరం పాటించకుండా కరోనా నిబంధనలను గాలికొదిలేశారు. దీంతో ఆటగాళ్లు త్వరగానే అక్కడి నుంచి నిష్క్రమించారు.

ఈ బృందంలో స్వర్ణ పతక విజేత నీరజ్​ చోప్డాతో పాటు రెజ్లర్​ బజ​రంగ్ పునియా, రేసర్​ కేటీ ఇర్ఫాన్​, దీపక్​ పునియా, లవ్లీనా.. తదితరులు ఉన్నారు. మీరాబాయి చాను, పీవీ సింధు వారి ఈవెంట్లు ముగిసిన వెంటనే భారత్​కు చేరుకున్నారు.

టోక్యో ఒలింపిక్స్​లో భారత అథ్లెట్లు ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో మొత్తం 7 పతకాలు సాధించారు. 2012 లండన్​ ఒలింపిక్స్​లో గెలుపొందిన 6 పతకాల సంఖ్యను ఈసారి అధిగమించారు. జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్డా పసిడితో మెరవగా, రెజ్లింగ్​లో రవి దహియా, మీరాబాయి చాను రజతాలు సాధించారు. బాక్సింగ్​లో లవ్లీనా, బ్యాడ్మింటన్​లో పీవీ సింధు, రెజ్లింగ్​లో బజ​రంగ్ పునియా, పురుషుల హాకీ టీమ్..​ కాంస్య పతకాలు దక్కించుకున్నాయి.

ఇదీ చదవండి: 20 బ్రాండ్లపై పీవీ సింధు దావా! కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.