ETV Bharat / sports

ఇంగ్లాండ్​పై ఆసీస్ విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్​కు!

author img

By

Published : Dec 11, 2021, 12:12 PM IST

WTC 2021-23 Points Table: యాషెస్ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్ ఆరో స్థానానికి పడిపోయింది.
Australia in WTC 2021-23 Points Table, Ashes 2021 news, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, యాషెస్ సిరీస్
Australia

WTC 2021-23 Points Table: యాషెస్ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది ఆస్ట్రేలియా. తద్వారా 1-0 తేడాతో సిరీస్​లో ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ రెండో ఎడిషన్​ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది ఆసీస్. ఈ ఎడిషన్​లో తొలి సిరీస్​ ఆడుతున్న ఆసీస్​కు ఈ మ్యాచ్​లో విజయంతో 12 పాయింట్లతో పాటు 100 పర్సంటేజ్ లభించింది.

అలాగే భారత్​తో సిరీస్​ను 2-1తేడాతో కోల్పోయిన ఇంగ్లాండ్​.. ఈ మ్యాచ్​లోనూ పరాజయం చెందడం వల్ల 14 పాయింట్లు, 23.33 పర్సంటేజ్​తో ఆరోస్థానానికి పడిపోయింది. టీమ్ఇండియా విషయానికి వస్తే.. 42 పాయింట్లు, 58.33 పర్సంటేజ్​తో నాలుగో స్థానానికి దిగజారిపోయింది. 24 పాయింట్లు, 100 పర్సంటేజ్​తో శ్రీలంక అగ్రస్థానంలో కొనసాగుతోంది.

WTC 2021-23 Points System: డబ్ల్యూటీసీ-2 ​(2021-2023) కోసం కొత్త పాయింట్ల పద్ధతిని ఇదివరకే ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్ ​(ఐసీసీ). పర్సెంటేజ్​ ఆఫ్​ పాయింట్ల ప్రకారం జట్లకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు తెలిపింది. గెలిచిన ప్రతి మ్యాచ్​కు 12 పాయింట్లు వస్తాయని వెల్లడించింది.'

ఈ కొత్త పద్ధతి ప్రకారం గెలిచిన ప్రతి మ్యాచ్​కు 12 పాయింట్లు, పర్సెంటేజ్​ రూపంలో 100 పాయింట్లు ఇస్తారు. టై అయితే (6 పాయింట్లు, 50 శాతం), డ్రా (4 పాయింట్లు, 33.33 శాతం), ఓడిన మ్యాచ్​కు (0 పాయింట్లు, 0 శాతం) ఉంటాయి. మ్యాచ్​ల సంఖ్య ఆధారంగా సిరీస్​ పాయింట్లను కేటాయిస్తారు.

ఇవీ చూడండి: IND vs SA Series: నెట్స్​లో రోహిత్, షమీ.. సౌతాఫ్రికా సిరీస్ కోసం రెడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.