ETV Bharat / sports

పాక్​ జట్టు బలంగా ఉంది.. గొప్పగా ఆడాలి: కోహ్లీ

author img

By

Published : Oct 23, 2021, 8:30 PM IST

virat kohli
విరాట్ కోహ్లీ

టీ20 ప్రపంచకప్​లో భాగంగా.. తొలి మ్యాచ్​ పాకిస్థాన్​తో ఆడేందుకు టీమ్​ఇండియా(IND vs PAK t20) సిద్ధమవుతోంది. ఈ పోరు నేపథ్యంలో పాకిస్థాన్(Pakisthan Squad t20 World Cup) 12 మంది జట్టును ప్రకటించింది. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశాడు భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli News). పాక్​ జట్టు దృఢంగా కనిపిస్తోందని అన్నాడు.

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) క్రికెట్​ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్​, పాకిస్థాన్​ మ్యాచ్(IND vs PAK T20 Match)​ ఆదివారం జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు పోరుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. తాజాగా పాక్(Pak squad t20 World Cup)​ తమ 12 మంది జట్టును ప్రకటించింది. దీనిపై టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ(Virat Kohli News) కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్​ జట్టు బలంగా కనిపిస్తోందని అన్నాడు. ప్రత్యర్థి జట్టుపై 100 శాతం గెలిచే అవకాశమున్నా.. ఆ జట్టును అశ్రద్ధ చేయకూడదని, అందులోనూ గేమ్​ ఛేంజర్స్ ఉన్నారని అభిప్రాయపడ్డాడు.

"పాకిస్థాన్​ జట్టు దృఢమైంది. వారి జట్టులో గేమ్​ ఛేంజర్స్​ ఉన్నారు. వారిపై గొప్ప ప్రదర్శన చేయాలి. టాప్​ ఆటగాళ్లతో గొప్పగా ఆడాలని భావిస్తున్నా."

-విరాట్ కోహ్లీ, టీమ్​ఇండియా సారథి.

దాయాది పోరులో 12-0 తేడాతో టీమ్​ఇండియాదే పైచేయి. 7 వన్డేలు, 5 టీ20 ప్రపంచకప్​లలో టీమ్ఇండియానే విజయం సాధించింది. పాకిస్థాన్​ ఒక్క వరల్డ్​ కప్​మ్యాచ్​లోనూ గెలవనప్పటికీ విరాట్​ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

హార్దిక్ బౌలింగ్ చేయొచ్చు..!

టీమ్​ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్​ పాండ్యా(Hardik Pandya News) బౌలింగ్​ ఫామ్​పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. వార్మప్​ మ్యాచ్​ల ముందే వైస్​ కెప్టెన్ రోహిత్ శర్మ.. అసలైన మ్యాచ్​ల్లో హార్దిక్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడని పేర్కొన్నాడు. తాజాగా అంశంపై విరాట్​ కోహ్లీ స్పందించాడు. హార్దిక్​ బౌలింగ్​ చేసేందుకు సమాయత్తమవుతున్నాడని తెలిపాడు. కనీసం రెండు ఓవర్లైనా అతడు వేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి:

T20 world cup: కోహ్లీకి సాధ్యంకాని రికార్డు రోహిత్ ఖాతాలో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.