ETV Bharat / sports

'టీమ్​ఇండియాకు పొగమంచు గండం.. ఎదుర్కొనేందుకు సిద్ధం'

author img

By

Published : Oct 19, 2021, 2:49 PM IST

టీ20 ప్రపంచకప్​లో పొగమంచు సమయంలోనూ ఎవరైతే గొప్పగా బౌలింగ్ చేయగలరో వారికే ప్రాధాన్యం ఇస్తామని అన్నారు టీమ్ ఇండియా కోచ్​ రవిశాస్తి. ఈ సీజన్​లో టీమ్​ఇండియా అన్ని మ్యాచ్​లు దాదాపు సాయంత్రం సమయంలోనే అడనున్న నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

T20 world cup
టీమ్​ఇండియా అప్​డేట్స్​

టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా అక్టోబర్​ 24న పాకిస్థాన్​తో తన తొలి మ్యాచ్​ ఆడనుంది. ఈ సీజన్​లో టీమ్​ఇండియా అన్ని మ్యాచ్​లు దాదాపు సాయంత్రం సమయంలోనే ఉన్నాయి. ఈ క్రమంలో పొగమంచు ఆటపై ప్రభావం చూపనుంది. దీనిపై టీమ్​ఇండియా కోచ్ రవి శాస్త్రి స్పందించారు. పొగమంచు అధికంగా ఉంటే పేసర్లను రంగంలోకి దించుతామని పేర్కొన్నారు. వార్మప్ మ్యాచ్​లోనే ఈ విషయాన్ని గ్రహించిన్నట్లు వెల్లడించారు.

"మ్యాచ్​పై మంచు ఎంత మేరకు ప్రభావం చూపుతుందనే దానిపై ఆధారపడి మొదట బౌలింగ్​/బ్యాటింగ్ ఏది తీసుకోవాలో నిర్ణయించుకుంటాం. దీనికి అనుగుణంగానే స్పిన్నర్ల/ ఫేసర్లను ఎవరిని బరిలోకి దించాలో తేలుస్తాం."

-రవిశాస్త్రి, టీమ్ఇండియా కెప్టెన్​

పొగమంచు ఎక్కువగా ఉంటే స్పిన్నర్లకు బాల్​పై గ్రిప్ దొరకదు. అందువల్ల బ్యాట్స్​మెన్ అలవోకగా ఆడతారు. ఇలాంటి సమయంలో పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది. అందువల్లే ఏ జట్టైనా తేమను దృష్టిలో పెట్టుకుని జట్టు కూర్పును మారుస్తూ ఉంటుంది.

ఇదీ చదవండి: T20 world cup: 'ఇలా అయితే టీమ్​ఇండియాకు విజయం కష్టమే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.