ETV Bharat / sports

PBKS IPL 2022: రాహుల్ ఎఫెక్ట్.. ఒక్కరూ వద్దంటున్న పంజాబ్!

author img

By

Published : Nov 27, 2021, 1:24 PM IST

KL Rahul
కేఎల్ రాహుల్

PBKS Retained Players 2022: ఐపీఎల్​ 2022 మెగా వేలానికి సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో పంజాబ్​ కింగ్స్​.. ఏ ఆటగాళ్లను రిటైన్​ చేసుకోవాలో తెలియక సందిగ్ధంలో పడినట్లు సమాచారం. పంజాబ్​ జట్టులో కొనసాగేందుకు కేఎల్​ రాహుల్ అయిష్టత చూపిన కారణంగా ఆ జట్టు పూర్తిగా కొత్త జట్టుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

PBKS Retained Players 2022: కింగ్స్​ ఎలెవన్​ పంజాజ్​ పేరుకు కలిసి రావట్లేదని పంజాబ్​ కింగ్స్​గా జట్టు పేరును మార్చారు. అయినా.. పంజాబ్​ తలరాత మారలేదు. ఆఖరిదాకా పోరాడటం అసలైన సమయంలో చేతులెత్తేయడం పంజాబ్​ జట్టు నైజంగా మారిపోయింది! దీంతో ఐపీఎల్ 14 సీజన్​లో పీబీకేఎస్​ను గెలిపించేందుకు వీరోచిత పోరాటం చేసిన కేఎల్ రాహుల్(IPL 2022 KL Rahul)​ ఇక జట్టులో కొనసాగలేనని నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఈ నిర్ణయంతో పంజాబ్ కింగ్స్​ జట్టు సందిగ్ధంలో పడింది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్​ మెగా వేలం సమయం ఆసన్నమవుతున్న వేళ ఆ జట్టు ఎవరిని రిటైన్​ చేసుకోవాలో తెలియక సతమతమవుతోంది.

నవంబర్ 30లోగా పాత ఫ్రాంఛైజీలు తాము రిటైన్(IPL 2022 Players Retained) చేసుకునే ఆటగాళ్ల పేర్లను సమర్పించాలని ఇప్పటికే బీసీసీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో పంజాబ్​ కింగ్స్​ ఎవరిని అట్టిపెట్టుకోనుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ వేలం సందర్భంగా ఏ ఒక్క ఆటగాడిని అట్టిపెట్టుకోకుండా పంజాబ్ కొత్త జట్టుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

మయాంక్​కు రూ. 16 కోట్లా?

రాహుల్​ వైదొలుగుతున్న నేపథ్యంలో పంజాబ్​ జట్టు మయాంక్​ అగర్వాల్​ను రిటైన్​ చేసుకోవచ్చు. అయితే.. అతడి కోసం పంజాబ్ రూ. 16 కోట్లు వెచ్చిస్తుందా? అనే వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అన్​కాప్డ్​ ఆటగాళ్లు.. రవి బిష్ణోయ్, అర్ష్​దీప్​ సింగ్​లను అట్టిపెట్టుకునేందుకు పంబాబ్ కింగ్స్​ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. వీరిని రిటైన్​ చేసుకున్నా పంజాబ్​ కింగ్స్ పర్సు నుంచి రూ. 4 కోట్లు మాత్రమే ఖాళీ అవుతుంది.

రాహుల్​పై కన్నేసిన కొత్త జట్లు..

IPL New Teams Retention: వచ్చే సీజన్​ ఐపీఎల్​లో రెండు కొత్త జట్లు కూడా పోటీ పడనున్నాయి. అయితే.. అహ్మదాబాద్, లఖ్​నవూ జట్లు రాహుల్​ను కెప్టెన్​గా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే.. వేలానికి ముందు ఈ రెండు జట్లు ముగ్గురు ఆటగాళ్లను రిటైన్​ చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ అగర్వాల్​పై ఆ జట్లు దృష్టి సారించనున్నాయి.

ఇదీ చదవండి:

IPL 2022: ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. ఐపీఎల్-15 అప్పటినుంచే..!

ధోనీ అభిమానులకు గుడ్​న్యూస్.. మరో మూడేళ్లు సీఎస్కేతోనే!

IPL 2022: ఐపీఎల్​ రిటెన్షన్.. ఏ జట్టులో ఎవరెవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.