ETV Bharat / sports

రోహిత్ సారథ్యంలో ఆడాలని ఉంది: వాన్

author img

By

Published : May 29, 2021, 12:02 PM IST

Updated : May 29, 2021, 12:25 PM IST

Michael Vaughan
రోహిత్

ధోనీ, కోహ్లీ ఇద్దరు ఉత్తమ సారథులు అని చెప్పినప్పటికీ.. అన్ని ఫార్మట్లలో కలిపి మహీనే గొప్ప సారథి అని తన అభిప్రాయాన్ని చెప్పాడు ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ మైఖేల్‌ వాన్‌​. సారథిగా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి త్వరలో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్​ కోహ్లీకి ఓ మంచి అవకాశమని అన్నాడు. రోహిత్​ శర్మ నాయకత్వంలో ఐపీఎల్​ ఆడాలని ఉందని తన మనసులోని మాటను తెలిపాడు.

టీమ్​ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఘనత మాజీ సారథి ధోనీకి(ms dhoni) మాత్రమే దక్కుతుంది. కాగా, దాదాపు 60టెస్టులో 36 మ్యాచ్​లు గెలిచి, ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం సాధించిన రికార్డు ప్రస్తుతం కెప్టెన్​ కోహ్లీది(Kohli).​ ఇద్దరూ గొప్ప ఆటగాళ్లు, సారథులుగా.. ఎన్నో ఘనతలను, ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే తాజాగా సోషల్​మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఇంగ్లాండ్​ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌​.. వీరిద్దరిలో ఎవరూ గొప్ప కెప్టెన్​ అనే విషయమై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దీంతో సహా త్వరలో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final)​, ఇంగ్లాండ్​ సిరీస్(England Series)​ గురించి కూడా మాట్లాడాడు.

"ధోనీ.. వన్డే సిరీస్​లో అన్ని నైపుణ్యాలు కలిగిన ఓ గొప్ప నాయకుడు. ముఖ్యంగా టీ20లో బెస్ట్​ కెప్టెన్​. టీమ్​ఇండియాకు దొరికిన ఓ వరం. అయితే విరాట్​ కూడా ఓ ఉత్తమ సారథి. టెస్టు జట్టును తన తెలివితేటలతో అద్భుతంగా నడిపిస్తున్నాడు. అయితే అన్ని ఫార్మట్లలో కలిపి వీరిద్దరిలో ఒకరిని ఎంపిక చేయాల్సి వస్తే మహీనే గొప్ప నాయకుడు అని నా భావన."

-మైఖేల్‌ వాన్‌, ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​.

జూన్​ 18 నుంచి న్యూజిలాండ్​తో జరగబోయే ప్రపంచటెస్టు ఛాంపియన్​షిప్​ ఫైన్​లో కోసం భారత జట్టు ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లనుంది. టీమ్​ఇండియాకు విజయాన్ని అందించి చరిత్రలో ఉత్తమ సారథిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి కోహ్లీకి ఈ మ్యాచ్​ గొప్ప అవకాశముని అన్నాడు వాన్​.

ఇంగ్లాండ్​దే గెలుపు

ఇంగ్లాండ్​ పర్యటనలో డబ్ల్యూటీసీ ఫైనల్​ తర్వాత ఇంగ్లీష్ జట్టుతో సిరీస్​ ఆడనుంది టీమ్​ఇండియా. అయితే ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు వాన్​. ఇరు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని చెప్పాడు. ఈ సిరీస్​లో కోహ్లీ(Kohli), జో రూట్(Joe Root)​ ఎక్కువ పరుగులు చేస్తారని, బుమ్రా, క్రిస్​ వోక్స్​ అత్యధిక వికెట్లు తీస్తారని అన్నాడు.

రోహిత్​(Rohit) నాయకత్వంలో

ఐపీఎల్(IPL)లో ముంబయి ఇండియన్స్​(Mumbai Indians).. ప్రపంచంలోనే ఉత్తమ జట్టు​ అని మైఖేల్‌ వాన్‌ కితాబిచ్చాడు. రోహిత్​కు​ నాయకత్వ లక్షణాలు, శాంతి స్వభావం, తెలివితేటలు, మైదానంలో రచించే వ్యూహాలు మెండుగా ఉన్నాయని, హిట్​మ్యాన్​ను చూస్తే తనను తాను చూసుకున్నట్లు ఉంటుందని అన్నాడు. అతడి నాయకత్వంలో తనకు ఐపీఎల్​ ఆడాలని ఉందని మనసులోని మాట చెప్పాడు.

ఇదీ చూడండి ధోనీకి ఆ బంతిని అస్సలు వేయను: కమిన్స్‌

Last Updated :May 29, 2021, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.