ETV Bharat / sports

'బెట్టింగ్ సంస్థలు కూడా ఐపీఎల్​ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవచ్చా?'

author img

By

Published : Oct 28, 2021, 5:30 AM IST

IPL trophy
ఐపీఎల్ కప్పు

ఐపీఎల్​ కొత్త ఫ్రాంచైజీలను(IPL 2022 new team name) కొనుగోలు చేసిన సంస్థపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆహ్మదాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న సీవీసీ క్యాపిటల్స్​పై(CVC capital india) విమర్శలు చేశారు ఐపీఎల్​ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ. బెట్టింగ్​లు నిర్వహించే ఆ సంస్థ బిడ్​ను దక్కించుకోవడమేంటని బీసీసీఐని ప్రశ్నించారు.

ఐపీఎల్(IPL 2022 New Teams)​ కొత్త ఫ్రాంచైజీల్లో ఒకటైన అహ్మదాబాద్​ జట్టును సీవీసీ క్యాపిటల్స్(CVC capital india) సంస్థ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యంపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ(Lalit Modi News) కూడా ఈ సంస్థకు ఫ్రాంచైజీ దక్కడంపై తీవ్రంగా విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు.

సీవీసీ క్యాపిటల్ సంస్థ(CVC betting company) ప్రముఖ బెట్టింగ్ కంపెనీలలో పెట్టుబడులు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై పలువురి విమర్శలకు ప్రాధాన్యం ఏర్పడింది.

  • i guess betting companies can buy a @ipl team. must be a new rule. apparently one qualified bidder also owns a big betting company. what next 😳😳😳 - does @BCCI not do there homework. what can Anti corruption do in such a case ? #cricket

    — Lalit Kumar Modi (@LalitKModi) October 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"బెట్టింగ్ కంపెనీలు కూడా ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయొచ్చన్నమాట. ఇది బీసీసీఐ తెచ్చిన కొత్త రూల్​ అనుకుంటా. ప్రస్తుతం ఓ ఫ్రాంఛైజీ దక్కించుకున్న బిడ్డర్​కు పేరుమోసిన బెట్టింగ్ సంస్థ కూడా ఉంది. బీసీసీఐ ఈ సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోలేదా ఏంటి?. ఇలాంటి పరిస్థితుల్లో అవినీతి నిరోధక శాఖ ఎలా పనిచేస్తుంది?."

--లలిత్ మోదీ, ఐపీఎల్ మాజీ ఛైర్మన్.

అయితే.. కొత్త ఫ్రాంచైజీల కొనుగోలుకు సంబంధించిన బిడ్డింగ్ పద్ధతిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ప్రక్రియ అంతా పారదర్శకంగా సాగిందన్నారు.

ఐపీఎల్​లో రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం ఇటీవల జరిగిన వేలంలో(IPL franchise auction) అహ్మదాబాద్‌ను రూ.5,625 కోట్లకు సీవీసీ క్యాపిటల్స్‌ పార్ట్​నర్స్‌ సొంతం చేసుకుంది. లఖ్‌నవూను(IPL new teams) రూ.7,090 కోట్లతో ఆర్పీఎస్జీ వెంచర్స్​ అధినేత సంజీవ్​ గోయంకా దక్కించుకున్నారు. అయితే సంజీవ్​కు ఐపీఎల్​ ఫ్రాంచైజీ దక్కడంలో​ గంగూలీ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదీ చదవండి:

న్యూజిలాండ్​కు షాక్​..​ భారత్​తో మ్యాచ్​కు గప్తిల్​ దూరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.