ETV Bharat / sports

న్యూజిలాండ్​కు షాక్​..​ భారత్​తో మ్యాచ్​కు గప్తిల్​ దూరం!

author img

By

Published : Oct 27, 2021, 6:59 PM IST

న్యూజిలాండ్​ జట్టుకు మరో షాక్ తగిలింది. టీ20 ప్రపంచకప్​లో భాగంగా టీమ్​ఇండియాతో(IND vs NZ T20) జరిగే మ్యాచ్​కు కివీస్​ ఆటగాడు గప్తిల్(Martin Guptill News) దూరం కానున్నట్లు తెలిసింది. కాలి వేలుకు గాయమైన కారణంగా అతడు మ్యాచ్​కు అందుబాటులో ఉండకపోవచ్చని కివీస్​ జట్టు ప్రధాన కోచ్ గారీ స్టెడ్ అన్నాడు.

guptill
గప్తిల్

టీ20 ప్రపంచకప్​లో భాగంగా టీమ్ఇండియాతో(IND vs NZ T20 Match) తలపడేందుకు సిద్ధమవుతున్న న్యూజిలాండ్​ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే కాలి పిక్క భాగంలో చీలిక కారణంగా జట్టుకు దూరమవుతున్నట్లు పేసర్ ఫెర్గూసన్ (Ferguson News)​ ప్రకటించగా.. ఇప్పుడు మరో ఆటగాడు మార్టిన్ గప్తిల్ కూడా జట్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

మంగళవారం పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో(PAK vs NZ t20) భాగంగా హ్యారిస్​ రౌఫ్​ బౌలింగ్​లో ఓపెనర్​ గప్తిల్ కాలి వేలుకు గాయమైంది. దీంతో భారత్​తో జరిగే మ్యాచ్​లో అతడు​ ఆడటం అనుమానమే అని కివీస్​ జట్టు ప్రధాన కోచ్ గారీ స్టెడ్ తెలిపాడు.

"కాలి వేలుకు గాయమైన కారణంగా పాక్​తో మ్యాచ్ అనంతరం గప్తిల్ కాస్త నీరసంగా కనిపించాడు. మరో రెండు రోజుల్లో అతడి గాయం తగ్గుతుందా లేదా అనేది స్పష్టత వస్తుంది." అని స్టెడ్ పేర్కొన్నాడు.

పాకిస్థాన్​తో మ్యాచ్​కు ముందే న్యూజిలాండ్ పేసర్​ ఫెర్గూసన్ టీ20 ప్రపంచకప్​కు దూరమవుతున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ వెల్లడించింది. ఇప్పుడు గప్తిల్​ కూడా జట్టుకు దూరమైతే కివీస్​పై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. కాగా, అక్టోబర్ 31న టీమ్​ఇండియాతో తలపడనుంది న్యూజిలాండ్.

పాక్​దే పైచేయి..

మంగళవారం జరిగిన మ్యాచ్​లో న్యూజిలాండ్​పై అలవోకగా గెలిచి టోర్నీలో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది పాకిస్థాన్. బౌలింగ్​తో న్యూజిలాండ్​ను కట్టడి చేసి 134 పరుగులు స్వల్ప లక్ష్యానికే పరిమితం చేసింది. అనంతరం ఛేదనలో మహ్మద్ రిజ్వాన్(33 పరుగులు), ఆసిఫ్ అలీ(27 పరుగులు)తో రాణించి పాక్​ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇదీ చదవండి:

NZ vs PAK T20: పాక్​ ఖాతాలో రెండో విజయం.. కివీస్ చిత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.