ETV Bharat / sports

మోహన్​ బగన్ ఫ్రాంచైజీ నుంచి తప్పుకోనున్న గంగూలీ!

author img

By

Published : Oct 27, 2021, 9:36 PM IST

ganguly
గంగూలీ

పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Ganguly News).. మోహన్ బగన్ ఫ్రాంచైజీ నుంచి వైదొలిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ క్రీడా సంస్థ పేర్కొంది.

పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో మరోసారి చిక్కుల్లో పడ్డ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Ganguly News).. ఏటీకే మోహన్ బగన్ ఫ్రాంచైజీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్​లో సభ్యుడిగా వైదొలగనున్నట్లు తెలుస్తోంది. ఆర్పీఎస్జీ వెంచర్స్​ అధినేత సంజీవ్ గోయంకాకు ఐపీఎల్​ ఫ్రాంఛైజీ దక్కినందున గంగూలీపై విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దాదా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

"భారత్​లో బాగా పాపులర్ అయిన ఫుట్​బాల్​ క్లబ్​లలో మోహన్ బగన్ ఒకటి. ఇండియన్​ సూపర్​ లీగ్​(ఐఎస్​ఎల్​)లోనూ ఇది భాగమే. అయితే.. గంగూలీ ఈ ఫ్రాంచైజీ బోర్డులో సభ్యుడు మాత్రమే కాదు. అతడు ఇందులో షేర్​హోల్డర్​గానూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో గంగూలీ కీలక పదవి నుంచి వైదొలిగేందుకు సన్నాహాలు చేస్తున్నాడు." అని ఓ క్రీడా సంస్థ తెలిపింది.

కీలకంగా వ్యవహరించారా?

ఐపీఎల్​లో రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం ఇటీవల జరిగిన వేలంలో(IPL franchise auction) అహ్మదాబాద్‌ను రూ.5,625 కోట్లకు సీవీసీ క్యాపిటల్స్‌ పార్టనర్స్‌ సొంతం చేసుకోగా.. లఖ్‌నవూను(IPL new teams) రూ.7,090 కోట్లతో ఆర్పీఎస్జీ వెంచర్స్​ అధినేత సంజీవ్​ గోయంకా దక్కించుకున్నారు. అయితే సంజీవ్​కు ఐపీఎల్​ ఫ్రాంచైజీ దక్కడంలో​ గంగూలీ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇండియన్​ సూపర్​ లీగ్​లో​(ఐఎస్​ఎల్​) సంజీవ్ గోయంకా ఛైర్మన్​గా ఉన్న ఏటీకే-మోహన్​ బగన్​​ ఫ్రాంచైజీ బోర్డు ఆఫ్​ డైరెక్టర్స్​లో గంగూలీ సభ్యుడుగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

గతేడాది జూన్​లో ఏటీకే క్లబ్​ బోర్డు ఆఫ్​ డైరెక్టర్స్​లో సభ్యుడుగా గంగూలీ ఎంపికయ్యాడు. ఇందులో ఉత్సవ్​ పరేఖ్​, శ్రిన్​జోయ్​ బోస్​, దెబాశిష్​ దత్తా​, గౌతమ్​ రేయ్​, సంజీవ్​ మెహ్రా సభ్యులుగా ఉన్నారు.

గంగూలీపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన ఓ బీసీసీఐ సీనియర్​ అధికారి.. "ఇది వివాదాస్పద అంశమని స్పష్టంగా తెలుస్తోంది. గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడని అర్థం చేసుకోవాలి. అతను ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు" అని పేర్కొన్నాడు.

పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయమై గంగూలీతో అనుబంధం గురించి ఓ టీవీ ఛానల్​ ఇంటర్వ్యూలో మాట్లాడిన గోయంక.. అతను (గంగూలీ) మెహన్​ బగన్​ నుంచి పూర్తిగా తప్పకున్నారని తెలిపారు. అయితే ఎప్పుడు జరిగిందని ప్రశ్నించగా.. మంగళవారం(అక్టోబరు 26) జరిగిందని అన్నారు. తర్వాత సారీ అంటూ.. 'ఈ విషయాన్ని గంగూలీ చెప్పాలి. అయితే నేనే ముందుగా చెప్పాను" అని అన్నాడు. అయితే ఆ తర్వాత కూడా.. మెహన్​ బగన్​ నుంచి వైదొలుగుతున్నట్లు గంగూలీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది ఐపీఎల్​ ఫ్రాంచైజీ వేలంలో గోయంకాకు దాదా సాయం చేసినట్లు వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. అయితే ఈ విషయమై గంగూలీ స్పందించాల్సి ఉంది.

ఇదీ చదవండి:

నీరజ్​ చోప్రా, మిథాలీ రాజ్​కు ఖేల్​రత్న- ధావన్​కు అర్జున!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.