ETV Bharat / sports

తడబడిన దిల్లీ బ్యాట్స్​మెన్.. కోల్​కతా లక్ష్యం 128

author img

By

Published : Sep 28, 2021, 5:24 PM IST

IPL news 2021
ఐపీఎల్

ఐపీఎల్ 2021లో భాగంగా కోల్​కతా నైట్​రైడర్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్​మెన్ తడబడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది దిల్లీ.

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన దిల్లీకి శుభారంభం దక్కినా తర్వాత తడబడింది. ఓపెనర్లు స్మిత్, ధావన్​ మొదటి వికెట్​కు 35 పరుగులు జోడించారు. అనంతరం దూకుడు మీదున్న గబ్బర్​ను పెవిలియన్ చేర్చాడు ఫెర్గుసన్. తర్వాత వచ్చిన శ్రేయస్ (1) విఫలమయ్యాడు. తర్వాత పంత్​తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు స్మిత్. వీరిద్దరూ మూడో వికెట్​కు 37 పరుగులు జోడించాక స్మిత్ (39) ఔటయ్యాడు. కాసేపటికే హెట్​మెయర్​(4), లలిత్ యాదవ్ (0), అక్షర్ పటేల్ (0), అశ్విన్ (9) పెవిలియన్​కు క్యూ కట్టారు. ఓవైపు వరుస వికెట్లు కోల్పోతున్నా పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లో రెండు పరుగులకు ప్రయత్నించిన పంత్ (39) రనౌట్​గా వెనుదిరిగాడు. దీంతో చివరికి 127 పరుగులతో సరిపెట్టుకుంది దిల్లీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.