ETV Bharat / sports

ధోనీ న్యూ లుక్.. ఐపీఎల్ ప్రోమో​ అదిరిందిగా

author img

By

Published : Mar 14, 2021, 8:07 PM IST

Will history be created yet again this IPL?- ipl promo
ధోనీ న్యూలుక్.. ఐపీఎల్ ప్రోమో​ అదిరిందిగా

మహేంద్ర సింగ్​ ధోనీతో ఓ ఆకర్షణీయ ప్రకటన విడుదలచేసింది వివో ఐపీఎల్. రోహిత్​ శర్మ, విరాట్ కోహ్లీని ఉద్దేశించి తీసిన ఆ వీడియో క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

'ఎవరి మంత్రం ఫలిస్తుంది?' అంటూ ఆకర్షణీయమైన ప్రోమో విడుదల చేసింది ఇండియన్ ప్రీమియర్​ లీగ్. ఈ ప్రోమోలో రెండు విభిన్నమైన లుక్స్​లో కనిపించిన ధోనీ.. ఐపీఎల్​ 2021పై అంచనాలు పెంచేస్తున్నాడు.

కోపంతో ఎన్నో జట్లపై అధిపత్యం సాధించిన కోహ్లీ మంత్రం ఈ ఐపీఎల్​లో ఫలిస్తుందో లేదో చూడాలంటే.. ఏప్రిల్​ 9న ప్రారంభమయ్యే వివో ఐపీఎల్​ కోసం వేచిచూడాల్సిందేనని అభిమానులను ఊరించాడు ధోనీ.

విజయం సాధించాలనే ఆకలి మంచిదే అని ముంబయి ఇండియన్స్​ కెప్టెన్ రోహిత్​ శర్మను ఉద్దేశించి ధోనీ చెబుతున్న వీడియోను ఐపీఎల్​ విడుదలచేసింది. మరోసారి చరిత్ర సృష్టిస్తాడా అంటూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇదీ చూడండి: భారత్​ బౌలింగ్​.. జట్టులోకి సూర్యకుమార్, ఇషాన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.