ETV Bharat / sports

పరీక్షల్లో నెగిటివ్.. టీమ్​ఇండియా ప్రాక్టీస్​ షురూ

author img

By

Published : Nov 14, 2020, 4:44 PM IST

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్​ఇండియా ఆటగాళ్లు.. ఔట్​డోర్​ ప్రాక్టీసులు పాల్గొన్నారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

team india
టీమ్​ఇండియా

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్​ఇండియా ఆటగాళ్లకు కరోనా నిర్ధరణ పరీక్షల్లో నెగటివ్​గా తేలింది. దీంతో శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. సిడ్నీ ఒలింపిక్​ పార్క్​లో ప్రాక్టీసు చేయగా, ఆ ఫొటోల్ని బీసీసీఐ ట్వీట్ చేసింది.

స్పిన్నర్ హార్దిక్​ పాండ్య, మహ్మద్​ సిరాజ్​, పృథ్వీ షా, ​ కుల్దీప్​ యూదవ్​, పేసర్​ ఉమేశ్​ యాదవ్​, ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా, శార్దూల్​ ఠాకూర్​, చేతేశ్వర్​ పూజారా, టి. నటరాజన్​, దీపక్​ చాహర్​ తదితరులు జిమ్​లో కసరత్తులు చేస్తూ కనిపించారు.

ఇరుజట్ల మధ్య నవంబరు 27 నుంచి జనవరి 19 వరకు మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి. తన భార్య అనుష్క బిడ్డను జన్మనివ్వనున్న నేపథ్యంలో సారథి కోహ్లీ టెస్టు సిరీస్​లోని​ చివరి మూడు మ్యాచ్​లకు అందుబాటులో ఉండట్లేదు.

ఇదీ చూడండి : ఆస్ట్రేలియా గడ్డపై భారత్​ దూసుకెళ్లేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.