ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఛానెల్ సెవెన్తో ప్రసార హక్కుల ఒప్పందాన్ని కాపాడాలనుకుంటోంది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇందులో భాగంగా బయోబబుల్ కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతోంది. భారత్ సిరీస్, బిగ్బాష్ లీగ్ కోసం రూ.160 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఈ ఏడాది చివర్లో నాలుగు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది భారత్.
"భారత్తో సిరీస్, బిగ్బాష్ లీగ్ బయో సెక్యూర్ బబుల్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా బడ్జెట్ రూ.160 కోట్లు దాటింది. ఛానెల్ సెవెన్తో ప్రసార హక్కుల ఒప్పందాన్ని సీఏ కాపాడాలనుకుంటోంది" అని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది.
బయో బబుల్ కోసం రూ.53 కోట్లు ఖర్చవుతుందని మొదట సీఏ భావించింది. బిగ్బాష్ లీగ్కు సీఏ ప్రాధాన్యత ఇవ్వట్లేదని, పరిస్థితి మారకపోతే రూ.1600 కోట్ల ప్రసార హక్కుల డీల్ను రద్దు చేసుకోవాల్సి ఉంటుందని ఛానెల్ సెవెన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో బయో బబుల్ ఖర్చును సీఏ మూడురెట్లు పెంచేసింది.