ETV Bharat / sitara

'మైలురాయిని మంచి కోసం ఉపయోగించిన సామ్'

author img

By

Published : May 27, 2020, 5:01 PM IST

హీరోయిన్ సమంత ఇన్​స్టాగ్రామ్​లో 10 మిలియన్ల ఫాలోవర్లను చేరుకున్నారు. ఈ సందర్భంగా 10 ఎన్జీవోలకు విరాళమిస్తానని తెలిపారు.

సమంత
సమంత

అక్కినేని కోడలు సమంత సామాజిక మాధ్యమాల్లో ఓ మైలురాయిని చేరుకున్నారు. ఇన్​స్టాగ్రామ్​లో 10 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించిన నటిగా నిలిచారు. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ ఓ పోస్టు పెట్టారు సామ్. ఈ సందర్భంగా 10 ఎన్జీవోలకు అండగా ఉంటానని చెప్పుకొచ్చారు. హాలీవుడ్ నటి నటాలీ పోర్ట్‌మన్ కూడా ఇలానే చేశారని.. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా అదే పని చేస్తున్నట్లు సమంత వెల్లడించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే కాజల్ అగర్వాల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డేలకు 10 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నారు సామ్. ఇందులో నయనతార కూడా నటిస్తున్నారు. నయన్ ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలతో పాటు వెబ్​సిరీస్​లపైనా దృష్టిసారించారు సమంత. ఆమె నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్​ 2 త్వరలోనే విడుదల కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.