ETV Bharat / jagte-raho

ఆరుగురి మృతికి కారణమైన డ్రైవర్​ అరెస్ట్​

author img

By

Published : Feb 2, 2021, 2:16 PM IST

గత నెల 29న మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 304 ​ కింద కేసు నమోదు చేశారు.

Lorry driver arrested for causing road accident
ఆరుగురి మృతికి కారణమైన డ్రైవర్​ అరెస్ట్​

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట గ్రామశివారులోని 365 జాతీయ రహదారిపై గత నెల 29న ఆటోను లారీ కొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ దరావత్ కిషన్(46)ను గూడూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

మద్యం మత్తులో వాహనం నడుపుతూ ఆరుగురు మృతికి కారణమైనందున నిందితునిపై ఐపీసీ సెక్షన్ 304 ​ కింద కేసు నమోదు చేసినట్లు ఇన్​ఛార్జ్ డీఎస్పీ వెంకట రమణ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.