ETV Bharat / jagte-raho

పిండి వంటలు చేస్తుండగా గ్యాస్‌ లీక్.. నలుగురికి గాయాలు

author img

By

Published : Dec 22, 2020, 12:45 PM IST

ఇంట్లో పిండి వంటలు చేస్తున్నసమయంలో ప్రమాదవశాత్తూ గ్యాస్‌ లీకై.. నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

gas leakage incident in mahabubabad Four were injured
గ్యాస్‌ లీకైన ఘటనలో నలుగురికి గాయాలు

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. గ్యాస్‌పై పిండి వంటలు తయారు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ సిలెండర్‌ నుంచి గ్యాస్‌ లీకైంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో స్వామి, సందీప్‌, పద్మ, అనూషలు తీవ్ర గాయాలపాలయ్యారు.

సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు మంటలను ఆర్పేశారు. గాయపడిన బాధితులను ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి: గ్యాస్​ లీకై పూరిల్లు దగ్ధం.. కుటుంబసభ్యలు క్షేమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.