ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదంలో 8 నెలల గర్భిణి మృతి

author img

By

Published : Sep 21, 2020, 2:05 PM IST

రోడ్డు ప్రమాదంలో 8 నెలల గర్భిణి మృతి చెందిన విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లిలో చోటుచేసుకుంది. సోదరుడితో కలిసి ఆసుపత్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

8-month-pregnant woman died in road accident in nizamabad district
రోడ్డు ప్రమాదంలో 8 నెలల గర్భిణి మృతి

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్న ఘటనలో గాయపడిన 8 నెలల గర్భిణి రజిత(22) చికిత్స పొందుతూ మృతి చెందింది. నిజామాబాద్‌లోని ఆస్పత్రికి సోదరుడితో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: ఉరేసుకుని బిహార్​కు చెందిన వ్యక్తి బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.