APSET 2024 Results OUT : అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు అర్హత కోసం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ సెట్) - 2024 ఫరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ సెట్ పరీక్షను ఏప్రిల్ 24న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించగా, ఈ రోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. అర్హత సాధించిన వారి వివరాలు, ఫైనల్ కీ, ర్యాంక్ కార్డు, సబ్జెక్టుల వారీ కటాఫ్ మార్క్స్, అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఏపీ సెట్ పరీక్షకు 30,448 మంది హాజరయ్యారు. వీరిలో అర్హత సాధించిన 2,444 మంది అభ్యర్థుల వివరాలను హాల్ టికెట్ నెంబర్లతో సహా ప్రత్యేక జాబితాను విశ్వ విద్యాలయ అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు తమ స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకునేందుకు హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.