ETV Bharat / international

అరుణాచల్​ప్రదేశ్ సరిహద్దులో జిన్​పింగ్​ అనూహ్య పర్యటన

author img

By

Published : Jul 23, 2021, 11:20 AM IST

Xi Jinping makes rare visit to Tibetan town bordering Arunachal Pradesh
అరుణాచల్​ప్రదేశ్ సరిహద్దు పట్టణంలో జిన్​పింగ్​ అనూహ్య పర్యటన

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ అరుణాచల్​ప్రదేశ్​ సరిహద్దు సమీపాన టిబెట్​లోని ఓ పట్టణంలో అరుదైన పర్యటన చేపట్టారు. ఇప్పటివరకు ఈ ప్రాంతాన్ని చైనా నాయకులు మాత్రమే అప్పుడప్పుడూ సందర్శించారు. ఇప్పుడు అధ్యక్షుడే అక్కడ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో టిబెట్​లోని న్యింగ్​చీ పట్టణంలో చైనా అధ్యక్షుడు జిన్​ పింగ్ పర్యటించారు. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతాన్ని ఇప్పటివరకు చైనా నాయకులు మాత్రమే సందర్శించారు. అనూహ్యంగా ఇప్పుడు జిన్​పింగ్ ఇక్కడ పర్యటించడం చర్చనీయాంశమైంది.

బుధవారం ఉదయం న్యింగ్​చీ చేరుకున్న జిన్​పింగ్​కు స్థానిక ప్రజలు, సంప్రదాయ తెగలు, అధికారులు సాదర స్వాగతం పలికినట్లు జినువా వార్తా సంస్థ పేర్కొంది.

పర్యటనలో భాగంగా న్యాంగ్ నది వంతెనను జిన్​పింగ్ సందర్శించారు. బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో పర్యవరణ పరిరక్షణను పరిశీలించారు.

అరుణాచల్ ప్రదేశ్​.. దక్షిణ టిబెట్​లో భాగమని చైనా చాలా ఏళ్లుగా వాదిస్తోంది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖపై భారత్​-చైనా మధ్య సరిహద్దు వివాదం నెలకొంది.

గత కొన్ని సంవత్సరాలలో టిబెట్ సరిహద్దులో చైనా అధ్యక్షుడు అధికారికంగా​ పర్యటించడం ఇదే తొలిసారి. చైనా జూన్​లో తన మొదటి బుల్లెట్ రైలు సేవలను ఇక్కడ ప్రారంభించినప్పుడు న్యింగ్​చీ పట్టణం వార్తల్లో నిలిచింది.

ఇదీ చూడండి: భారత్-చైనా మధ్య త్వరలోనే 12వ విడత చర్చలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.