ETV Bharat / international

రెచ్చిపోయిన తాలిబన్లు- ఆత్మాహుతి దాడిలో జవాన్లు బలి

author img

By

Published : Sep 5, 2021, 3:19 PM IST

Updated : Sep 5, 2021, 6:08 PM IST

ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు ఒడిగట్టారు. తెహ్రీక్​ ఏ తాలిబన్​ పాకిస్థాన్​ ముఠాకు చెందిన ఉగ్రవాది(suicide bomber).. భద్రతా బలగాలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి(suicide attack in pakistan) పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు.. ఇరాక్​లోని కిర్​కుక్​ ప్రాంతంలో జరిగిన ఉగ్ర దాడిలో 13 మంది పోలీసులు మరణించారు.

Taliban suicide bomber blows himself
తాలిబన్ల ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​ రాష్ట్రంలో తెహ్రీక్​ ఏ తాలిబన్ పాకిస్థాన్​(టీటీపీ) ఉగ్రముఠాకు చెందిన సభ్యుడు (suicide bomber) ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు(suicide attack in pakistan). ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్ర రాజధాని క్వెట్టా నగరంలోని మస్టుంగ్​ రోడ్​ చెక్​పాయింట్​లోని భద్రతా సిబ్బందే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు.. నగర డీఐజీ అజార్​ అక్రమ్​ తెలిపారు. ఆ బలగాలు రాష్ట్రంలోని ఉగ్రవాద నిర్మూలన కోసం పని చేస్తున్నట్లు చెప్పారు. గాయపడిన 20 మందిలో 18 మంది భద్రతా సిబ్బంది కాగా.. ఇద్దరు స్థానికులుగా తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

Taliban suicide bomber blows himself
ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతం

ఈ దాడి చేసింది తామేనని తెహ్రీక్​ ఏ తాలిబన్​ పాకిస్థాన్​ (టీటీపీ) ప్రకటించింది. కాబుల్​లో తాలిబన్(Afghanistan Taliban)​ ప్రభుత్వం వచ్చిన క్రమంలో టీటీపీని అదుపు చేయొచ్చనే పాకిస్థాన్​ ఆలోచన సరైంది కాదనే సంకేతాలను పంపేందుకే ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.

Taliban suicide bomber blows himself
దాడిలో పూర్తిగా ధ్వంసమైన ద్విచక్రవాహనం

ఖండించిన ప్రధాని..

భద్రతా బలగాలపై ఆత్మాహుతి(Suicide attack) దాడిని తీవ్రంగా ఖండించారు ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విదేశీ మద్దతుతో చెలరేగుతున్న ఉగ్రవాదుల నుంచి తమ దేశాన్ని కాపాడినందుకు వీర జవాన్లకు సెల్యూట్​ చేస్తున్నానన్నారు.

ఇరాక్​లో 13 మంది మృతి..

ఉత్తర ఇరాక్​లోని కిర్​కుక్​ ప్రాంతానికి సమీపంలో ఉన్న చెక్​పాయింట్​పై ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 13 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికి మీడియా తెలిపింది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సటిహా గ్రామంలోని చెక్​పాయింట్​పై కొందరు సాయుధులు కాల్పులకు పాల్పడ్డారని ఓ అధికారి తెలిపారు. సుమారు ఒక గంట పాటు ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు.

ఇదీ చూడండి: సంబరాల పేరుతో 17 మందిని కాల్చి చంపిన తాలిబన్లు

Last Updated :Sep 5, 2021, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.