ETV Bharat / international

'ఆలూ, టమాట ధరలు లెక్కేయడానికే రాజకీయాల్లోకి వచ్చానా?'

author img

By

Published : Mar 14, 2022, 1:39 PM IST

Pak PM Imran Khan News: ఆలూ, టమాట ధరలు లెక్కేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని.. దేశ యువత కోసం వచ్చానని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తనకు వ్యతిరేకంగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంపై ఖాన్​ మండిపడ్డారు.

Pakistan PM Imran Khan
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

Pak PM Imran Khan News: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆలూ, టమాట ధరలు లెక్కేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. దేశ యువత కోసమే వచ్చానని స్పష్టం చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని హఫీజాబాద్​లోని రోడ్ షోలో పాల్గొన్న ఇమ్రాన్​ ఖాన్​.. ప్రతిపక్షాలు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఖండించారు.

"ఆలూ, టమాట ధరలు లెక్కేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. దేశ యువత కోసం వచ్చాను. పాకిస్థాన్ గొప్ప దేశం కావాలంటే నిజానికి మద్దతు ఇవ్వాలి. ఇదే విషయాన్ని నేను పాతికేళ్లుగా చెబుతున్నా. దేశంలోని అవినీతిపరులైన రాజకీయ నేతలను అడ్డుకునేందుకు న్యాయవ్యవస్థకు అధికారం ఉంది." అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాకిస్థాన్ గొప్ప దేశంగా అవతరించబోతుందని.. తన మాటలు గుర్తుపెట్టుకోవాలన్నారు ఖాన్. తమ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను చేకూరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

మొత్తం 342 లోక్​సభ సభ్యులున్న పార్లమెంటులో.. ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి వైదొలగాలంటే 272 మంది ప్రధానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి. ఇమ్రాన్ ఖాన్ 2018లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో పాకిస్థాన్​లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: 'ఉక్రెయిన్​పై యుద్ధంలో చైనా సాయం కోరిన రష్యా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.