ETV Bharat / international

బస్సు బోల్తా - 13 మంది మృతి

author img

By

Published : Jul 26, 2021, 10:16 PM IST

Bus accident in China
చైనాలో బస్సు ప్రమాదం

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో 13 మంది మృతి చెందారు. మరో 47మంది గాయపడ్డారు.

చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో బస్సు బోల్తా పడి 13 మంది మరణించారు. మరో 47 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 63 మంది ఉన్నట్లు స్థానిక మీడియా జిన్హువా పేర్కొంది.

ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలను క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు.

ఇదీ చూడండి: నీటి కొరతపై ఆందోళన- పోలీసుల కాల్పుల్లో 8 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.