ETV Bharat / entertainment

RC 15: రూ.15కోట్లతో మరో పాట.. ఏకంగా 500 మంది డ్యాన్సర్లతో!

author img

By

Published : Feb 7, 2023, 11:56 AM IST

RC 15 500 dancers
RC 15: రూ.15కోట్లతో మరో పాట.. ఏకంగా 500 మంది డ్యాన్సర్లతో!

దర్శకుడు శంకర్​ రామ్​చరణ్​ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్ సీ 15 సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు..

తన సినిమాలోని పాటల చిత్రీకరణ కోసం స్టార్​ డైరెక్టర్ శంకర్ భారీగానే ఖర్చు చేస్తారన్న సంగతి తెలిసిందే. భారీ హంగులతో కోట్లు వెచ్చించి మరీ షూట్​ చేస్తారు. ఆయన గత చిత్రాలు చూస్తే పాటలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అయితే ఇప్పుడాయన మెగా పవర్​స్టార్​ రామ్ చరణ్​తో కలిసి సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ, అంజలి ఈ చిత్రంలో హీరోయిన్స్​గా నటిస్తున్నారు. . అయితే, ఈ సినిమాలోనూ అద్భుతం అనిపించేలా శంకర్​ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం.

ఆ మధ్య కాలంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉందని.. 7 నిమిషాల నిడివి ఉండే సన్నివేశం కోసం ఏకంగా రూ.70 కోట్లు ఖర్చుచేస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఒక పాట కోసం ఏకంగా రూ.25 కోట్లు, మరో రెండు సాంగ్స్ కోసం రూ.8కోట్లు, రూ.15కోట్లు కేటాయించారని ప్రచారం సాగింది. రీసెంట్​గా కూడా మరో పాటను రూ.15కోట్లు పెట్టి తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరి ఆ పాట కోసమే లేదా మరో సాంగ్​ కోసమే ఏకంగా 500 మంది డ్యాన్స్​ర్లను రంగంలోకి దింపారట. వారందరితో కలిసి పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ విషయం సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి.

ఇకపోతే భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ, అంజతీతో పాటు ఎస్‌. జె. సూర్య, నవీన్​ చంద్ర, సునీల్​ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీ నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి: సుక్కు స్కూల్​ నుంచి మరో డైరెక్టర్​.. సిద్ధు నెక్ట్స్​ మూవీ అతడితోనేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.