ETV Bharat / crime

కశ్మీర్​లో వరంగల్​ వాసి అనుమానాస్పద మృతి

author img

By

Published : Dec 10, 2022, 7:58 PM IST

Telangana young man Suspicious death in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్​లో తెలంగాణ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుళ్లిన స్థితిలో కనిపించిన మృతదేహాన్ని వరంగల్​కు చెందిన కంచర్ల సృజన్​గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Telangana young man Suspicious death
యువకుడి అనుమానాస్పద మృతి

Telangana young man died in Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్​లోని గందర్​బాల్​ జిల్లాలో సోనామార్గ్​ బైపాస్​ రోడ్డు ప్రాంతంలో గుర్తు తెలియని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

మృతి చెందిన యువకుడు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్​ జిల్లాకు చెందిన కంచర్ల సృజన్​గా పోలీసులు గుర్తించారు. సీఆర్​పీసీ 174 కింద కేసు నమోదు చేసుకొన్న కశ్మీర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మృతుని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.