ETV Bharat / crime

బైక్​ను ఢీకొట్టిన లారీ డ్రైవర్ అరెస్టు

author img

By

Published : Apr 30, 2021, 12:31 PM IST

Updated : Apr 30, 2021, 1:13 PM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతికి కారణమైన లారీ డ్రైవర్​ను పటాన్​చెరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు పంపించారు. మద్యం తాగి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

Lorry driver arrested, lorry driver arrested in Patan lake, Sangareddy district news, Sangareddy district crime news
లారీ డ్రైవర్ అరెస్టు, పటాన్​చెరులో లారీ డ్రైవర్ అరెస్టు, సంగారెడ్డి జిల్లా వార్తలు, సంగారెడ్డి జిల్లా నేర వార్తలు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను లక్డారం వద్ద ఓ లారీ డ్రైవర్ ఢీకొట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

శంషాబాద్​ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో లారీ డ్రైవర్ మద్యం సేవించినట్లు నిర్ధరణ అయింది. లక్డారం జాతీయ రహదారిపై ప్రమాదం చేసింది ఆ వ్యక్తేనని తెలియగా పటాన్​చెరు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న పటాన్​చెరు పోలీసులు.. రిమాండ్​కు తరలించారు. డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన మహదేవ్ బోరేగా గుర్తించారు. మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

Last Updated :Apr 30, 2021, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.