ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @9AM

author img

By

Published : Nov 2, 2020, 8:56 AM IST

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్​ న్యూస్ @9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1. స్మగ్లర్లు... సజీవదహనం

ఏపీలోని కడప శివారులోని విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం అయ్యారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పి అక్రమ మార్గంలో ఎర్రచందనం తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. కడప శివారు గోటూరు వద్ద స్మగ్లర్లకు చెందిన రెండు కార్లు టిప్పర్‌ను ఢీకొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. రిజిస్ట్రేషన్లు షురూ

ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 20 మండలాలు మినహా.. 570 తహసీల్దార్‌ కార్యాలయాలు ఇందుకు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో 55 రోజుల తర్వాత... వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. గేరు పడేనా?

అంతర్​రాష్ట్ర ఆర్టీసీ సర్వీసుల సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అన్నీ అనుకున్నట్లే జరిగితే.. సోమవారం సాయంత్రం నుంచి తెలంగాణ-ఏపీ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు ఏయే మార్గాల్లో ఎన్ని సర్వీసులు నడపాలో పూర్తి స్పష్టత వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. పరిష్కార ప్రక్రియకు శ్రీకారం

రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు పురపాలకశాఖ శ్రీకారం చుడుతోంది. దరఖాస్తుల ఆధారంగా క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టేందుకు ముందు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రెండు వాహనాలు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మరో 10 మందికి గాయాలయ్యాయి. భక్తులు కిఛోరా షరీఫ్ దర్గాను సందర్శించి తిరిగివస్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. 'బ్లాక్ ఓటర్ల'పై బైడెన్ దృష్టి

అధ్యక్ష ఎన్నికలకు ఒక్కరోజే సమయం ఉన్న నేపథ్యంలో నల్లజాతీయుల ఓట్లే లక్ష్యంగా డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. కీలక రాష్ట్రాల్లో విజయావకాశాలు పెంచుకునేందుకు ఆయన ప్రచార బృందం వీరిపై దృష్టి సారించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. 73కు చేరిన మృతుల సంఖ్య

టర్కీ భూకంప ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగుతోంది. ఇప్పటివరకు 73 మంది మరణించారని టర్కీ అత్యవసర, విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది. 961 మంది గాయపడ్డారని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. ఐసీఐసీఐ షాక్

బ్యాంకు పనివేళలు మించిన తర్వాత డిపాజిట్ యంత్రం ద్వారా నగదు డిపాజిట్ చేసేందుకు రూ. 50 ఛార్జీ వసూలు చేస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. ఈ నెల 1 నుంచి నిబంధన అమలులోకి వచ్చినట్లు పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ ఆగస్టు నుంచే ఇలాంటి ఛార్జీ వసూలు చేస్తోంది.

9. హామిల్టన్​ ఖాతాలో మరో విజయం

ఫార్ములా వన్ రేసర్​ లూయిస్​ హామిల్టన్(ఇంగ్లాండ్​).. ఆదివారం జరిగిన ఎమీలియా రొమాగ్నా గ్రాండ్​ ప్రి రేసులో విజేతగా నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్ హామిల్డన్​కిది 93వ గ్రాండ్​ ప్రి టైటిల్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. ప్రభాస్​కు ఆ నటిపై క్రష్​ ఉందట!

హీరో ప్రభాస్​కు ​తనపై క్రష్​ ఉందని తెలిపారు బాలీవుడ్​ నటి భాగ్యశ్రీ. రాధేశ్యామ్ సినిమా చిత్రీకరణలో ఈ విషయాన్ని డార్లింగ్​ తనతో చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రంతో ఆమె రీఎంట్రీ ఇవ్వనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.