ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM

author img

By

Published : Apr 27, 2021, 9:01 PM IST

ETV BHARAT TOP TEN 9PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1. 'ఈటీవీ బాలభారత్'​ ఛానళ్ల​ను ప్రారంభించిన రామోజీరావు

చిన్నారుల వినోదానికి సరికొత్త వేదికను తీసుకువచ్చింది ఈటీవీ నెట్​వర్క్​. 'బాలభారత్​' పేరుతో దేశవ్యాప్తంగా 11 భాషల్లో.. ఛానళ్లను మంగళవారం ఒకేసారి ప్రారంభించారు రామోజీ గ్రూప్​ సంస్థల ఛైర్మన్ రామోజీరావు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ముగిసిన ప్రచారం.. 30న పోలింగ్‌

రాష్ట్రంలో మినీ పురపోరుకు సంబంధించి ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ప్రధాన పార్టీలు హోరాహోరిగా చేసిన ప్రచారానికి తెరపడింది. విమర్శలు, ప్రతివిమర్శలతో మారుమోగిన మైకులు బందయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ఆక్సిజన్‌ కొరత లేదన్న ఈటల

రాష్ట్రంలో అవసరమైన ఆక్సిజన్‌ కంటే ఎక్కువే ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నామని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కరోనా కట్టడికి రాష్ట్ర అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'కర్ఫ్యూ తర్వాత చర్యలు చెప్పండి'

కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నెల 30న పురపోరు పోలింగ్​కు ఎలాంటి ఏర్పాట్లు చేశారో నివేదించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. మాస్క్​లను సరైన విధంగా పెట్టకపోయినా కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీస్ శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ముగిసిన ఎమ్మెస్సార్​ అంత్యక్రియలు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎం.సత్యనారాయణరావు అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‌ మహాప్రస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. తొలి వెండి దేవాలయం

దేశంలో మొట్టమొదటి వెండి ఆలయం మధ్యప్రదేశ్​లో నిర్మితమవుతోంది. దీనిని రూ.200 కోట్ల వ్యయంతో ఐదేళ్లలో సిద్ధం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'సంక్షోభాన్ని చూస్తూ ఉండలేం'

కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై సుమోటోగా కేసు విచారణ జరిపింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో జాతీయ సంక్షోభంపై స్పందించకుండా ఉండలేమని పేర్కొంది. హైకోర్టుల్లో కరోనా అంశాలపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఏడుగురు మృతి

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​లో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 70మందికి పైగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఆటగాళ్లకు క్రికెట్​ ఆస్ట్రేలియా హామీ

భారత్​ నుంచి విమాన రాకపోకలను ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధించడంపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. ఆసీస్ ఆటగాళ్లకు సహాయం చేయడానికి బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులతో చర్చలు జరుపుతామని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. భాగ్యనగరం చేరిన నయన్

సూపర్​స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'అన్నాత్తే'. తాజాగా ఈ సినిమా షూటింగ్​లో పాల్గొనేందుకు హైదరాబాద్​కు విచ్చేసింది నయనతార. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.